టాలీవుడ్ లో చాలా వరకు హీరోయిన్ ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు దర్శక నిర్మాతలు అనే వార్తలు మనం ఈ మధ్య చదువుతున్నాం. అగ్ర హీరోయిన్ అయినా చిన్న హీరోయిన్ అయినా సరే ఇప్పుడు ఎక్కువగా సినిమాల విషయంలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు అని భావించి వారికి భారీగా పారితోషికం తగ్గించే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారు అని జనాలు అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో ఒక వార్త ఏంటీ అంటే... హీరోయిన్ లు భారీగా పారితోషికం తగ్గించుకుని సినిమాలను చేయడానికి రెడీ అయ్యారు అని. 

 

ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ మాత్రం కూడా బెట్ చేసినా సరే ఇబ్బంది వస్తుంది అనే అంచనాకు స్టార్ హీరోయిన్ లు కూడా వచ్చారు అని తెలుస్తుంది. అందుకే ఇప్పుడు దాదాపుగా సినిమాల విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచి౦చి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అని అంటున్నారు. స్టార్ హీరో సినిమా అయినా చిన్న హీరో సినిమా అయినా ఏ హీరో సినిమా అయినా సరే చాలా వరకు చూసి అడుగుతున్నారు గాని ఇంత కావాలి అని వాళ్ళు డిమాండ్ చేయడం లేదు అని అంటున్నారు. రష్మిక పారితోషికం విషయంలో భారీగా వెనక్కు తగ్గింది అని సమాచారం. 

 

ఇక ఆమె తో పాటుగా మరో హీరోయిన్ పూజ హెగ్డే కూడా వెనక్కు తగ్గింది అని ఎక్కువగా డిమాండ్ చేయడం లేదు అని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు ముందుకు వెళ్తుంది అనేది చూడాలి. పుష్ప సినిమాకు గానూ రష్మిక మంధన చాలా వరకు తక్కువగానే డిమాండ్ చేసింది గాని ఎక్కువగా అడగడం లేదు అని టాక్. చూడాలి మరో వాళ్లకు ఏ విధంగా అవకాశాలు వస్తాయో ఎంత వరకు జాగ్రత్తగా సినిమాలు చేస్తారో...

మరింత సమాచారం తెలుసుకోండి: