సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణవార్త యావత్ దేశాన్ని కలచివేస్తోంది. ఈ పరిణామం తో బాలీవుడ్ ఇండస్ట్రీ లో వారసత్వం పై సోషల్ మీడియాలో సరికొత్త ఉద్యమం నడుస్తోంది. ఎంతో భవిష్యత్తు మరియు మంచి నటుడు సమాజంపై సరైన భావన కలిగి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణించిన సుశాంత్ మరణాన్ని దేశప్రజలు తట్టుకోలేకపోతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలే బ్యాక్ గ్రౌండ్ లేని వారిని వారికి అవకాశాలు లేకుండా లైఫ్ రాకుండా అడ్డుకుంటున్నారని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. దీనికి ఉదాహరణగా సోషల్ మీడియాలో సాహో విలన్ పాత్రలో నటించిన నీల్ నితిన్ ముకేష్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఏ మాత్రం బ్యాక్ గ్రౌండ్ లేని చిన్న నటీనటులను ప్రముఖులు ఏవిధంగా చిన్నచూపు చూస్తారు అన్న దానికి ఉదాహరణ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

బాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన ఓ అవార్డు ఫంక్షన్ లో షారుఖ్ ఖాన్ అతడిని “నీకు ఇంటి పేరు లేదేంటి” అంటూ కామెంట్ చేసాడు. దానికి భంగపడ్డ అతను హోస్ట్ చేస్తున్న షారుఖ్, సైఫ్ ఇద్దరినీ ‘షటప్’ అన్నాడు. ఈ వీడియో తెగ వైరల్ అయింది కానీ దీనికి వెనక మరో స్టోరీ ఉంది. అదంతా ఆ షో రక్తి కట్టించడం కోసం షారుఖ్ ఆడించిన నాటకం. ఆ టైంలో సాహో విలన్ నీల్ నితిన్ ముకేష్ అది చేయడానికి భయపడినా కానీ షారుఖ్ ఎంకరేజ్ చేసి 'నోరు మూయమని' అనమని చెప్పాడట. దీంతో ఇబందిగాన్నే నీల్ నితిన్ ముకేష్ చెప్పాడట. 

 

ఆ వేడుకలో ఉన్న కత్రినా కైఫ్ పరిగెత్తుకుంటూ వచ్చి షారుఖ్ కి సారీ చెప్పమని చెప్పిందట. అలా అతను ‘యాక్ట్’ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ట్రోల్స్ కి పనికొస్తోంది. చాలామంది బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఈ విధంగానే చిన్న నటీనటులను ట్రీట్ చేయటం వల్ల సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లాంటి మంచి నటులు చనిపోతున్నారని అంటున్నారు. బాలీవుడ్ లో ప్రముఖులు టాలెంట్ ఉన్న నటి నటులను ఈ విధంగాన్నే బలి తీసుకుంటున్నారని అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నారని దేశ జనాలు సుశాంత్ మరణ వార్త పై ఘాటుగా రియాక్ట్ అవ్వుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: