బాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణ వార్త దేశవ్యాప్తంగా చాలా మందిని ప్రభావితం చేస్తోంది. ఇండియన్ ఫిలిం లవర్స్ ఈ వార్త విని ఎంతగానో కలవరం చెందుతున్నారు. ఎంతో మంచి టాలెంట్ ఉన్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అతి చిన్న వయసులో 34 సంవత్సరాల వయసులో చనిపోవడం పట్ల అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ మరణం చెందిన తరువాత వస్తున్న వార్తలు ఇప్పుడు చాలా మందిని సినిమా ఇండస్ట్రీ లపై అసహ్యత కలిగించే విధంగా మారాయి. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోవటం వెనకాల బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

IHG

దీంతో దేశ వ్యాప్తంగా 'నెపోటిజం' పేరుతో చాలా మంది బాలీవుడ్ ఇండస్ట్రీ పై నిరసన ఆందోళనలు చేస్తున్నారు. వారసత్వంగా సిల్వర్ స్క్రీన్ పై నటిస్తున్న నటీనటులను వారి సినిమాలను బాయ్ కాట్ చేయాలని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో 'నెపోటిజం' పేరుపై ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా చాలామంది సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.

IHG

ఈ సందర్భంగా ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలో నిలిచే శ్రీరెడ్డి కూడా స్పందించడం జరిగింది. తాజాగా సోషల్ మీడియాలో గట్స్ లేని మూవీ లెజండ్స్ మాత్రమే న్యూ టాలెంట్ ని చంపేస్తున్నారు. సేమ్ ఆన్ యూ సో కాల్డ్ చిరంజీవి - నాగార్జున - బాలీవుడ్ ఖాన్స్ మరియు కపూర్ ఫ్యామిలీస్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇంకా చాలా ఘాటుగా శ్రీరెడ్డి స్పందించింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: