టాలీవుడ్ లో అకినేని ఫ్యామిలీ నటించిన మనం ఎంతటి సంచలనం అయిందో అందరికీ తెలిసిందే. అక్కినేని నాగేశ్వర రావు తో తన కుటుంబం మొత్తం స్క్రీన్ పంచుకున్న గొప్ప సినిమాగా చరిత్రలో నిలిచిపోతుందనడం లో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమా అక్కినేని నాగేశ్వర రావు ఆఖరు సినిమా అన్న విషయం కూడా అందరికి తెలిసిదే. విక్రం కుమార్ మనం సినిమాతో అక్కినేని ఫ్యామిలీతో ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నాగార్జున కి ఎప్పుడొచ్చి కథ చెప్తా అన్నా క్షణం ఆలోచించకుండా సమయం ఇచ్చేంత ప్రాముఖ్యతను అక్కినేని ఫ్యామిలీ దగ్గర సంపాదించుకున్నాడు.

 

ఇక ఈ సినిమా తర్వాత విక్రం కుమార్ తమిళ సూపర్ స్టార్ సూర్య తో 24 అన్న సినిమాని తీశాడు. సూర్య ని మూడు విభిన్నమైన గెటప్ లతో సిల్వర్ స్క్రీన్ మీద చూపించి మెస్మరైజ్ చేశాడు. అయితే ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికి కమర్షియల్ గా మాత్రం భారీ సక్సస్ ని అందుకోలేకపోయింది. అంతేకాదు ఈ సినిమా తర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ఞు, నేచురల్ స్టార్ నాని తో తీసిన గ్యాంగ్ లీడర్ సినిమాలు ఫ్లాప్స్ గా మిగిలాయి. అయినా విక్రం మరోసారి తన మార్క్ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ని తెరకెక్కించబోతున్నాడట. అక్కినేని నాగ చైతన్య ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా "థ్యాంక్యూ" అన్న టైటిల్ ని పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. 

 

అయితే ఈ సినిమా మొదలవుకుండానే విక్రం కుమార్ సూర్య తో తీసిన 24 కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడని కోలీవుడ్ మీడియా సమాచారం. అందుకు సూర్య సిద్దంగా ఉన్నప్పటికి కథ పూర్తిగా నచ్చితేనే చేస్తానని తేల్చి చెప్పాడట. క్యారెక్టర్ డిజైన్ చేయడంలో...హీరోని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో విక్రం కుమార్ ఖచ్చితంగా సక్సస్ అవుతాడు. కాని సక్సస్ ఫుల్ సినిమానే తీయలేకపోతున్నాడు. మరి సూర్య ఇంత ఖచ్చితంగా తేల్చి చెప్పాక 24 లాంటి ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ తీసి సక్సస్ ఇస్తాడా చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: