కరోనా ఎలాంటి వ్యక్తులను అయినా భయపెట్టడమే కాకుండా వారి ఆలోచనలను పూర్తిగా మార్చివేస్తోంది. సాధారణంగా ప్రతి విషయాన్ని చాల లైట్ గా తీసుకునే పూరి జగన్నాథ్ ఆలోచనలు కూడ కరోనా మార్చివేసింది అంటూ లీకులు వస్తున్నాయి. ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండతో తీస్తున్న ‘ఫైటర్’ మూవీ షూటింగ్ కరోనా భయాలతో ఆగిపోయింది.


అయితే ఈమధ్య ప్రభుత్వాలు షూటింగ్స్ మొదలు పెట్టుకోవడానికి అనుమతులు ఇవ్వడంతో పూరీ జగన్నాథ్ తన మూవీ షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టాలని ఆలోచనలు చేస్తున్నాడు. వాస్తవానికి ఇప్పటికే ముంబైలో 40 రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించి  స్టోరీలో ముందుగా రాసుకున్న ప్రకారం విజయ్ దేవరకొండ విదేశీ ఫైటర్స్ తో ఫైటింగ్ చేసే కొన్ని సీన్స్ ఉన్నాయట.


అయితే ప్రస్తుత పరిస్థితులలో అది సాధ్యపడదని భావించి లోకల్ ఫైటర్స్ తో ఈ ఫైటింగ్ సీన్స్ హైదరాబాద్ లో తీయాలని పూరి తన ఆలోచనలు మార్చుకున్నట్లు టాక్. పూరీ సినిమా అంటేనే బ్యాంకాక్ బీచ్ లలో సాంగ్స్ సీన్స్ లేకుండా గడవదు. అయితే ఈసారి ‘ఫైటర్’ సినిమాలో పాటలు అన్నీ రామోజీ ఫిలిం సిటీలోని వివిధ లోకేషన్స్ లో తీయబోతున్నట్లు తెలుస్తోంది.  అంతేకాదు ఈమూవీకి సంబంధించిన కథలో కూడ అనేక మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం.

 

ఈమూవీని పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో భారీ బడ్జెట్ తో తీయాలని మొదట్లో భావించారు. అయితే ఇప్పుడు కరోనా పరిస్థితులలో ఎందుకైనా మంచిది అని ఈమూవీ బడ్జెట్ ను తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది అన్న విషయం తెలిసిందే. ఈ మూవీ కథ అమ్మ సెంటిమెంట్ తో కిక్ బాక్సింగ్ నేపథ్యంలో ఉంటుందని వార్తలు రావడంతో ఈ మూవీ పై గతంలో పూరీ తీసిన ‘అమ్మా నాన్న తమిళ్ అమ్మాయి’ ఛాయలు ఉంటాయా అన్నసందేహాలు కొందరు వ్యక్త పరుస్తున్నారు. ప్రస్తుతం ఒక భారీ హీట్ విజయ్ దేవర కొండకు అవసరం అయిన పరిస్థితులలో ఈమూవీ పై విజయ్ దేవరకొండ చాల ఆశలు పెట్టుకున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: