మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇప్పుడిప్పుడే వరుస సక్సెస్ లని అందుకుంటూ ఒక ప్రధాన హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. గతంలో ఆరు వరుస ఫ్లాపులు రావడంతో కొంత డీలా పడిన సాయి తేజ్ కి చిత్రలహరి రూపంలో మంచి విజయం దక్కింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ సక్సెస్ సాధించింది. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రతీరోజూ పండగే చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని ఆ సక్సెస్ ని కంటిన్యూ చేశాడు.

 

ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటరు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా వల్ల ఈ చిత్ర రిలీజ్ వాయిదా పడింది. అయితే సాయి ధరమ్ తేజ్ తన తమ్ముడి సినిమాపై చాలా ఆసక్తిగా ఉన్నాడట. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఉప్పెన చిత్రం మరికొద్ది రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది.

 

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ సినిమాపై సాయితేజ్ చాలా నమ్మకం పెట్టుకున్నాడట. తన తమ్ముడి కెరీర్లో మంచి ప్రేమకథా చిత్రంగా నిలవబోతుందని నమ్ముతున్నాడట. అందుకే ఈ చిత్ర రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదీగాక ఔట్ ఫుట్ చూసిన సుకుమార్ చాలా సంతృప్తిగా ఉన్నాడట.

 

దాంతో సాయితేజ్ ఈ సినిమా పట్ల మరింత ఆసక్తి కనబరుస్తున్నాడట. క్రితిశెట్టి  హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. థియేటర్లు ఓపెన్ కాగానే రిలీజ్ అయ్యే మొదటి లిస్టులో ఈ సినిమా కూడా ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: