టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో బుల్లి తెర మీద తన మార్క్ వేసింది అనసూయ. పెళ్లి అయినా సరే పిల్లలు ఉన్నా సరే ఆమె నటన మీద తనకు ఉన్న అభిమానం తో  ఆమె సినిమాలు గాని టీవీ షోస్ గాని చేస్తూ వస్తున్నారు. ఇక కుర్ర యాంకర్లను తట్టుకుని ఆమె నేడు వరుసగా టీవీ లో కనపడుతున్నారు అనే చెప్పాలి. ఇక ఆది అలా ఉంటే ఆమె నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అనే చెప్పాలి. ఆమె నటిగా రెండు మూడు సినిమాల్లో కనిపించారు. ఆ పాత్రకు ఆమె ఎక్కడలేని అందం తీసుకొచ్చారు అని సినిమా చూసిన ఎవరు అయినా సరే చెప్పే మాట. 

 

ఆమె నటించిన రంగస్థలం సినిమాలో ఆమె వేసిన పాత్ర అదే విధంగా యాత్ర సినిమాలో గౌరు చరిత పాత్రలో కూడా ఆమె చాలా బాగా నటించారు. ఈ పాత్రలు ఆమెకు నటిగా మంచి గుర్తింపు తీసుకొచ్చాయి అనే చెప్పాలి. ఇక అగ్ర హీరోల సినిమాల్లో ఆమెకు అక్క గా నటించే అవకాశాలు వస్తున్నాయి అని అంటున్నారు. మరి ఆమె చేస్తుందా లేదా అనేది ఇంకా తెలియదు గాని ఆమెకు మాత్రం మంచి పాత్రలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఆమె టీవీ లో చాలా బిజీ గా ఉంది అనే సంగతి తెలిసిందే. ఆమెకు వరుసగా షోస్ చేసే అవకాశాలు రావడం తో ఆమె సినిమాల మీద కంటే టీవీ షోస్ మీద ఎక్కువగా దృష్టి పెడుతుంది. 

 

వాటికి పారితోషికం కూడా ఆమె బాగానే తీసుకుంటుంది అని టాక్. ఇక మహేష్ బాబు హీరో గా వస్తున్న సర్కారు వారి పాటలో ఆమెకు మంచి పాత్ర ఇచ్చారు అనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో అయితే బాగానే జరుగుతుంది మరి. చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: