మన తెలుగులో చిరంజీవి సినిమాలు అనగానే జనాలకు ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే మొదటి రోజు కచ్చితంగా సినిమా చూడాలి. లేకపోతే సినిమా చూసినట్టు ఉండదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఆయన రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో కూడా ఆయన   యువకుడిగానే నటిస్తున్నారు. ఇక ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం చూస్తే ఆయన రెండు సినిమాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు అని సమాచారం. 

 

రెండు సినిమాల విషయంలో కూడా మార్కెట్ ని పెంచుకోవడానికి గానూ ఎక్కువగా బాలీవుడ్ నటులను తీసుకోవాలి అని భావిస్తున్నారు. ఆచార్య సినిమాలో ఆయన బాలీవుడ్ నటుడ్ని తీసుకునే ఆలోచనలో ఉన్నారు అని ఆ నటుడు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. మరి ఏ పాత్రలో ఆయనను తీసుకుంటారు అనేది చూడాలి. పాన్ ఇండియా సినిమాలు అనగానే చిరంజీవి ముందు కాస్త భయపడ్డారు. ఇప్పుడు ఆయనలో ఏ మాత్రం కూడా పాన్ ఇండియా సినిమాల విషయంలో భయం లేదు అని బాలీవుడ్ లో మార్కెట్ ని కూడా పెంచుకునే ఆలోచనలో ఉన్నారట. 

 

అందుకే అక్కడి హీరోలకు తన సినిమాలో మంచి పాత్ర ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. సీనియర్ హీరో కావడం ఇప్పుడు సినిమాలకు కాస్త డిమాండ్ అనేది తగ్గడం తో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తుంది. చూడాలి మరి ఆయన ఏ విధంగా చేస్తారు అనేది. ఇక ఆయన లూసిఫార్ సినిమా లో మోహన్ లాల్ ని తీసుకోవాలి అని అదే విధంగా రణవీర్ సింగ్ ని కూడా తీసుకోవాలి అని సూచనలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి టాలీవుడ్ లో. చూడాలి మరి ఎం చేస్తారో...

మరింత సమాచారం తెలుసుకోండి: