బాలయ్య బాబు ఇటీవల తన 60వ పుట్టినరోజు సందర్భంగా పలు వెబ్ మీడియా చానల్స్ కి ఎన్నడూ లేని విధంగా వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చారు. చాలా విషయాలు రాజకీయానికి సంబంధించి, సినిమా రంగానికి సంబంధించి, వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక విషయాలు వీక్షకుల తో పంచుకున్నారు. ఈ సందర్భంగా చాలా ఇంటర్వ్యూలలో బాలకృష్ణ కి ఎదురైన ప్రశ్న...వారసుడు కొడుకు నందమూరి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడు అనేది. ఈ విషయంలో బాలకృష్ణ చాలా తెలివిగా ఒక్కోరకంగా ఒక్కో ఛానల్ కి సమాధానం ఇవ్వటం జరిగింది.
ఇదిలా ఉండగా తన కెరీర్లో సూపర్ డూపర్ హిట్ అయిన ఆదిత్య 369 సినిమా సీక్వెల్ ద్వారా నందమూరి మోక్షజ్ఞ ని సినిమా ఎంట్రీ ఇప్పించడానికి బాలయ్య బ్రేవ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో ఈ సినిమాని సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించడం జరిగింది. అయితే తాజాగా ఈ సినిమాని సీక్వెల్ చేయటానికి స్క్రిప్ట్ వర్క్ విషయంలో స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రాకు బాధ్యతలు బాలకృష్ణ అప్పజెప్పినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
ఈ స్క్రిప్ట్ ను డాక్టరేట్ చేసాక మళ్ళీ బాలయ్యకు నరేషన్ ఇస్తారట. అది కనుక ఓకే అయితే ఆదిత్య 999 పేరిట పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బాలయ్య బాబు బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అయిన వెంటనే తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పనుల పై బాలయ్య బాబు బిజీ గా ఉండే అవకాశం ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.