సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో హీరో, హీరోయిన్ ఎవరన్నదాని కన్న విలన్ ఎవరన్నది తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. ముందునుంది సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ చివరకు ఆ సస్పెన్స్ రివీల్ చేస్తారు. అయితే ఒక్కో డైరక్టర్ ఒక్కో స్టైల్ లో ఈ సినిమాలు తీస్తారు. లేటెస్ట్ గా మహానటి కీర్తి సురేష్ పెంగ్విన్ సినిమా కూడా ఈ జానర్ లో తెరకెక్కింది. అమేజాన్ ప్రైం లో మరికొద్ది గంటల్లో రిలీజ్ అవనున్న ఈ సినిమాలో జోకర్ వేషం వేసుకుని హత్యలు చేస్తూ ఉంటాడు. జోకర్ మాస్క్ వెనుక ఉన్నది ఎవరన్నది కనీసం చిత్రయూనిట్ కి కూడా రివీల్ చేయలేదట. 

 

అంటే వాళ్లు కూడా థ్రిల్ ఫీల్ అయ్యేలా సినిమా చూసినప్పుడే షాక్ అయ్యేలా డైరక్టర్ ఈశ్వర్ కార్తిక్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. చిత్ర నిర్మాత కార్తిక్ సుబ్బరాజు ప్లాన్ ప్రకారమే ఇలా షూట్ చేశారట. కనీసం చిత్రయూనిట్ కి కూడా ఆ వరుస హత్యలు చేసేది ఎవరో తెలియకుండా జాగ్రత్త పడ్డారట. వాళ్లకు తెలిస్తే బయటకు లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుందని.. అందరు సినిమా చివర్లో ఆ థ్రిల్ ఫీల్ అవ్వాలని అలా ప్లాన్ చేశారట.

 

అంతేకాదు అసలు ఈ విలన్ జెంట్ అయ్యి ఉంటాడా.. లేక లేడీనా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ సస్పెన్స్ కు తెర పడాలంటే మాత్రం పెంగ్విన్ సినిమా చూడాల్సిందే. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఓటిటి లో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాల్లో ఓ మోస్తారు బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.                              

మరింత సమాచారం తెలుసుకోండి: