మన తెలుగులో తమిళ హీరోయిన్ లకు మంచి ఆఫర్లు వస్తు ఉంటాయి. అగ్ర హీరోల సినిమాల్లో ఏదోక పాత్ర చేయడానికి గానూ వారిని తీసుకుంటూ ఉంటారు. ఇక టాలీవుడ్ హీరోలు కూడా తమిళ మార్కెట్ ని దృష్టి లో పెట్టుకుని అక్కడి హీరోయిన్ లతో ఎక్కువగా చర్చలు జరుపుతూ ఉంటారు. అందుకే కీర్తి సురేష్ కి ముందు నుంచి మంచి క్రేజ్. అదే విధంగా త్రిష లాంటి వారిని ఎక్కువగా ఆదరించారు. 

 

ఇప్పుడు టాలీవుడ్ దృష్టి మరో తమిళ స్టార్ హీరోయిన్ మీద పడినట్టు వార్తలు వస్తున్నాయి. వరలక్ష్మి శరత్ కుమార్ కి అక్కడ మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె మీద మహేష్ బాబు కన్నేసినట్టు తెలుస్తుంది. సర్కారు వారి పాటలో ఆమెను లేడీ విలన్ గా తీసుకోవాలి అని దర్శకుడికి ఆయన సూచనలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి మరి. ఆ పాత్రకు ఆమె సరిగా సరిపోతుంది అని చ‌ర్చించుకుంటున్నార‌ట‌.

 

ఆమె ఇప్ప‌టికే ప‌లు డ‌బ్బింగ్ సినిమాల‌తో పాటు సందీప్ కిష‌న్ సినిమా ద్వారా సుప‌రిచిత‌మే. ఆమె విల‌నిజం బాగా పండుతోంది. ఆమె ఉండే అటు త‌మిళ్ మార్కెట్ కు కూడా ఎంతైనా ప్ల‌స్ అవుతుంద‌నే చెప్పాలి. అందుకే మహేష్ బాబు ఆమె మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు అని సమాచారం. ఆమె కూడా అందుకు ఓకే చెప్పింది అని తెలుస్తుంది. మరి నిజమా కాదా అనేది తెలియదు గాని ఆమె మాత్రం హైదరాబాద్ కూడా వచ్చింది అని ఒప్పందం కూడా చేసుకుని వెళ్ళింది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. కాగా ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: