ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో భారీ రేటు పెట్టే హీరోయిన్ ల విషయంలో నిర్మాతలు ఒకటికి పది సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. అది ఏ హీరోయిన్ అయినా సరే  అలాగే ఆలోచిస్తున్నారు. హీరోయిన్ ఎక్కువ అడుగుతున్నారు అంటే ఆమెను కాదు అని మరొకరిని ఎంపిక చేయడానికి పెద్దగా సమయం కూడా తీసుకోవడం లేదు ఇప్పుడు జనాలు అనే విషయం అర్ధమవుతుంది. అగ్ర దర్శక నిర్మాతలు అయినా చిన్న దర్శక నిర్మాతలు అయినా సరే ఇదే విధంగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అనే విషయ౦ స్పష్టంగా అర్ధమవుతుంది. 

 

తాజాగా టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చెయ్యాలి అని త్రిష ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నట్టు ఈ మధ్య కాలంలో వార్తలు ఎక్కువగా వస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఆచార్య సినిమాలో నటించాలి అని చూసినా సరే  చిరంజీవి ఆమెను వద్దు అని చెప్పారు అని టాలీవుడ్ లో టాక్ ఎక్కువగా వినపడింది. దీనితో ఆమె దాని నుంచి పక్కకు తప్పుకున్నారు. ఎందుకు ఏంటీ అంటే తెలియదు గాని ఆమె ఎక్కువగా డిమాండ్ చేయడం తోనే ఆమెను పక్కన పెట్టారు అని టాలీవుడ్ జనాలు అన్నారు. ఆమె ఏ మాత్రం ఆలోచన లేకుండా కోట్లు అడిగారు అని అన్నారు. 

 

ఇప్పుడు భారీ గా ఆమె తగ్గించింది అని సమాచారం. అవును ఆమె ఎక్కువగా డిమాండ్ చేయడం లేదు అని ఇప్పుడు సినిమా చేస్తే చాలు అనుకునే విధంగా తెలుగులో అవకాశాల కోసం ఆమె ప్రయత్నాలు చేస్తుంది అని అంటున్నారు జనాలు. ఇప్పుడు దాదాపుగా ఆమెకు తెలుగులో అవకాశాలు లేవు. అయితే ఒక స్టార్ హీరో తో ఉన్న పరిచయాలతో ఆమె ఇక్కడ సినిమా చేయడానికి గానూ ప్లాన్ చేసింది అని సమాచారం. మరి ఎప్పుడు ఈ సినిమా వస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: