లాక్ డౌన్ సమయం లో డాక్టర్ లు ముఖ్యంగా చెప్తున్న జాగ్రత్తలు కరోనా పట్ల అవగాహన, ఆహార అలవాట్ల పట్ల జాగ్రత్త వహించాలని. ప్రతి ఒక్కరూ డైట్ ఈ విషయంలో జాగ్రత్త వహిస్తూ ఫిట్నెస్ సంపాదించాలని సూచిస్తుంటారు. అదే ఇంకా సినీ తారల విషయానికొస్తే ఇంకా ఎక్కువ జాగ్రత్త వహిస్తారు. ఏమాత్రం ఫిట్నెస్ మా  తెరమీద సీను మారుతుంది. అందాల తారలు తెరమీద అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గించిన అభిమానులు చిన్న బోతారు. 

 


టాలీవుడ్ కు భరత్ అనే నేను సినిమాతో పరిచయమైన కీయారా అద్వానీ మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ప్రిన్స్ మహేష్ బాబు సరసన అంతే గ్లామర్ తో స్క్రీన్ మీద ఎంతో అందంగా కనిపించింది. వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన మరో సినిమాలో తలుక్కున మెరిసింది. ఉత్తరాది నుంచి వచ్చిన ఈ భామ దక్షిణాదిలో స్థిరపడాలని ఉంది. అందుకే ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారీ వారి పాట అనే సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబు సరసన నటిస్తోంది. బాలీవుడ్ లో కూడా నటించిన ఈ భామ మంచి పేరు తెచ్చుకుంది. మీ టు ఉద్యమం నేపథ్యంలో నిర్మించిన గిల్టీ అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

 

 

ఇలాంటి భామ ఇప్పుడు లాక్ డౌన్ సమయం లో తన డైట్ సీక్రెట్స్ బయట పెట్టింది. తెల్లవారుజామున ఒక గ్లాసు నిమ్మరసం వేడి వేడి నీటితో కలిపి తాగుతుంది. దాని తర్వాత బ్రేక్ ఫాస్ట్ టైం లో యాపిల్, నారింజ, స్ట్రాబెర్రీ లాంటి పండ్లతో కూడిన ఒక బౌల్ ఓట్స్ ను తీసుకుంటుంది. వ్యాయామం చేసే ముందు యాపిల్ ముక్కలు, వేరుశెనగలు తీసుకుంటుంది. రోజువారి తినే ఆహారంలో  కూరగాయలు, బచ్చలకూర ఉంటాయంట. ఈ తారకు సీ ఫుడ్స్ అంటే ఎంతో ఇష్టం అంట.. ప్రోటీన్స్ కోసం ఎక్కువగా సి ఫుడ్స్ తింటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: