సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు పరుశురామ్ దర్శకత్వంలో వస్తున్నా ‘సర్కారు వారి పాట’ సినిమాలో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తున్నారు. స్వయంగా ఈ విషయాన్ని కీర్తి సురేష్ ఇటీవల సోషల్ మీడియాలో తన తాజా చిత్రం పెంగ్విన్ శుక్రవారం రిలీజ్ అవుతున్న సందర్భంగా చిట్ చాట్ లో తెలిపారు. ఎప్పటి నుండో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్న సమయంలో స్వయంగా కీర్తి సురేష్ ఈ విషయం తెలపడంతో మహేష్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.

IHG

'మహానటి' సినిమా తో సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కీర్తి సురేష్… ఆ తరువాత అనేక స్టార్ హీరోలతో సినిమాలు చేయడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా మహేష్ తదుపరి చిత్రం ‘సర్కారు వారి పాట’ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నట్లు… కన్ఫామ్ వార్తలు రావడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. సినిమాలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉండే అవకాశం ఉందని దానిలో ఒక హీరోయిన్ గా కీర్తి సురేష్ ఎంపికయినట్లు తాజాగా తేలడంతో… ఇంక మిగతా హీరోయిన్లు ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది.

IHG

యాక్షన్ ఎంటర్ టైనర్ గా రొమాంటిక్ లవ్ స్టోరీ తరహాలో ఈ సినిమాని పరుశురాం తెరకెక్కిస్తున్నారని ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, మహేష్ బాబు, మైత్రీ మూవీ మేకర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నారు. ఇటీవల కృష్ణా పుట్టినరోజునాడు సినిమాకి సంబంధించి రిలీజైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: