‘మహానటి’ మూవీతో జాతీయ ఉత్తమనటి అవార్డ్ ను అందుకోవడంతో కీర్తి సురేష్ ఖ్యాతి ఒకేసారి పెరిగిపోయింది. అయితే ఆతరువాత ఆమె నటించిన అనేక సినిమాలు విడుదలైనప్పటికీ ఆ సినిమాలలోని ఆమె పాత్రలకు గుర్తింపు రాకపోవడంతో పాటు ఆ సినిమాలు పెద్దగా సక్సస్ కాకపోవడంతో ఆమె కెరియర్ కన్ఫ్యూజన్ లో పడింది.


సాధారణ గ్లామర్ హీరోయిన్స్ లా కాకుండా నటనకు ప్రాధాన్యత ఇచ్చే పాత్రలను ఎంచుకోవడం పై ఎంతో ఆసక్తి కనపరిచే కీర్తి తన లేటెస్ట్ మూవీ ‘పెంగ్విన్’ పై చాల ఆసలు పెట్టుకుంది. అయితే కరోనా ఆమె ఆశల పై దెబ్బ కొట్టడంతో ఇప్పుడు ఆసినిమాను ఒటీటీ స్ట్రీమ్ లో నేడు విడుదల చేస్తున్నారు.


దీనితో ఈసినిమాకు వచ్చే స్పందన ప్రశంసలు బట్టి కీర్తి కెరియర్ ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు. ఈరోజు ఈమూవీ ఈమూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో దర్శకుడుకార్తిక్ సుబ్బరాజ్ ఒక ఛాలెంజ్ విసిరాడు. తెలుగు తమిళ మలయాళ భాషల్లో ఈరోజు రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్లు ట్రైలర్లు సింగిల్స్ ఇప్పటికే ఈమూవీ పై అంచనాలు పెంచుతున్నాయి.


ఈ చిత్రంలో గర్బిణిగా విభిన్నమైన పాత్రలోకీర్తి సురేశ్ నటించింది. ఈ చిత్రంలో జోకర్ మాస్క్‌లో ఉండే విలన్ పాత్ర ఈమూవీకి హైలెట్ కాబోతోంది. ఇప్పటివరకు ‘పెంగ్విన్’ చిత్రంలో విలన్ పాత్రను ఎవరు వేశారో అనే విషయాన్ని దర్శక నిర్మాతలు సీక్రెట్‌ గా పెట్టారు. ఈరోజు ఆ సీక్రెట్ బయటపడబోతోంది. ‘పెంగ్విన్’ సినిమా తొలి షాట్ నుంచి చివరి వరకు థ్రిల్లర్ మూవీగా ఉండబోతోంది. లాక్ డౌన్ మొదలయ్యాక ఒటీటీ స్ట్రీమ్ లలో విడుదలైన చాల సినిమాలు పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దీనితో ఒటీటీ లు ధియేటర్లకు ప్రత్యానయం కాదు అంటూ అనేక కామెంట్స్ వచ్చాయి. అయితే ఈరోజు అమెజాన్ ద్వారా విడుదల అవుతున్న ‘పెంగ్విన్’ సూపర్ సక్సస్ అయితే మరిన్ని సినిమాలు ముఖ్యంగా ‘నిశ్శబ్దం’ లాంటి సినిమాలు ఒటీటీ బాట పట్టే ఆస్కారం ఉంది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: