బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ చనిపోయి రోజులు గడుస్తున్నా అతడి మరణాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. వాస్తవానికి సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నా అతడిని బాలీవుడ్ ఇండస్ట్రీ సెలెబ్రెటీలు పరోక్షంగా చంపేశారు అంటూ బీహారుకు చెందిన ఒక న్యాయవాది కోర్టులో కేసు కూడ వేసాడు.


ఇది చాలదు అన్నట్లుగా సుశాంత్ సింగ్ అభిమానులు చాల ఎక్కువగా ఉండటంతో వారంతా ఇప్పుడు సుశాంత్ మరణాన్ని నిరసిస్తూ రాజమౌళికి వార్నింగ్ లు ఇవ్వడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. సుశాంత్ అభిమానుల అభిప్రాయం ప్రకారం అతడి ఆత్మహత్యకు పరోక్షంగా అలియా భట్ కూడ కారణం అంటూ ఆమెను టార్గెట్ చేస్తున్నారు.  


దీనికి కారణం గతంలో అలియా సుశాంత్ సింగ్ విషయంలో చాల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కరణ్ జోహార్ షోలో అలియా సుశాంత్ సింగ్ పై కుళ్ళు జోకులు వేయడమే కాకుండా సుశాంత్‌ ను చంపేసి రణ్‌బీర్‌ ను పెళ్లి చేసుకుంటానంటూ జోక్ లు వేసిందని ఈవిషయాలు అన్నీ సుశాంత్ సున్నితంగా తీసుకున్నాడు అంటూ అతడి అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడితో ఆగకుండా వీరంతా తమ దృష్టి రాజమౌళి తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ పై పెట్టి జక్కన్న తీస్తున్న ట్రిపుల్ ఆర్ నుంచి అలియాను తొలగించకపోతే ఆమూవీని  ఉత్తరాదిన విడుదల కాకుండా అడ్డుకుంటాము అంటూ వార్నింగులు ఇస్తున్నారు.


ఇప్పటికే రకరకాల సమస్యలతో ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి టెన్షన్ పడుతున్న రాజమౌళి ఇప్పుడు సుశాంత్ సింగ్ అభిమానుల వార్నింగ్ లు చూసి ఆశ్చర్యపడుతున్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా ఇండోనేషియాలోని సుశాంత్ సింగ్ అభిమానులు జకార్తా లోని ఒకపెద్ద బహిరంగ ప్రదేశంలో ఒక పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి సుశాంత్ నటించిన ఎమ్ ఎస్ ధోని మూవీని ఆ పెద్ద స్క్రీన్ పై ప్రదర్శించదమే కాకుండా ఆసినిమా ప్రదర్శిస్తున్నప్పుడు అక్కడకు కరోనాను కూడ లెక్క చేయకుండా వచ్చిన వందలాది మంది అభిమానులు ఆసినిమాను చూస్తూ కంట కన్నీళ్లు పెట్టుకుని నివాళులు అర్పించారు అంటే ఇండోనేషియాలో కూడ ఎలాంటి క్రేజ్ ఉందో అర్ధం అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: