యంగ్ హీరో నితిన్, రైజింగ్ హీరోయిన్ కీర్తి సురేష్  జంటగా నటిస్తున్న చిత్రం రంగ్ దే. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రం మేలోనే విడుదలకావల్సింది. కానీ కరోనా వల్ల ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాలేదు. ఇక ఆగస్టు నుండి రంగ్ దే షూటింగ్ స్టార్ట్ చేస్తామని కెమెరామెన్ పీసీ శ్రీరామ్ వెల్లడించాడు. లాంగ్ బ్రేక్ తరువాత ఆగస్టు నుండి షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇప్పటివరకు 70 శాతం షూటింగ్ పూర్తి కాగా 30 శాతం షూటింగ్ మాత్రమే మిగిలివుందని శ్రీరామ్ ట్వీట్ చేశాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో రంగ్ దే  విడుదలకానుంది. 
ఇక నితిన్ ఈసినిమాతోపాటు ప్రస్తుతం సాహసం ఫేమ్ చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో కూడా నటిస్తున్నాడు. చెక్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తుండగా భవ్య క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాలతరువాత నితిన్,అంధధూన్ రీమేక్ లో నటించనున్నాడు. మేర్లపాక గాంధీ తెరకెక్కించనున్న ఈచిత్రాన్ని నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ నిర్మించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: