మహేశ్​బాబు 'సర్కారు వారి పాట'లో కీర్తిసురేశ్​ హీరోయిన్​గా నటించనుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఇప్పటికే వచ్చిన ఫస్ట్​లుక్ పోస్టర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.
సూపర్​స్టార్ మహేశ్‌బాబు కొత్త చిత్రం 'సర్కారు వారి పాట'. గత నెల చివర్లో సూపర్​స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన టైటిల్‌ పోస్టర్‌ ఆసక్తి రేకెత్తించింది. అయితే ఇందులో హీరోయిన్​గా ఎవరు నటిస్తున్నారా? అని గతకొద్ది రోజుల నుంచి చర్చ నడుస్తూనే ఉంది. తాజాగా దీనికి సమాధానం దొరికేసింది.

 

మహానటి తో జాతీయ అవార్డు దక్కించుకున్న కీర్తిసురేశ్‌ ఇందులో హీరోయిన్​గా నటించనుంది. ఇన్‌స్టా లైవ్‌లో అభిమానులతో మాట్లాడుతూ ఈమెనే స్వయంగా ఈ విషయాన్ని చెప్పింది. ఇటీవల మహేశ్‌ తన అభిమానులతో ఇన్‌స్టా వేదికగా మాట్లాడుతూ.. "సర్కారు వారి పాట' బలమైన సందేశంతో కూడిన ఎంటర్‌టైనర్ అని, ఈ సినిమా విషయంలో చాలా ఆత్రుతతో ఉన్నా"నని చెప్పారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు.


ప్రిన్స్ మహేష్ బాబు, కీర్తి సురేష్ కాంబినేషన్ సరికొత్తగా మొదలైంది. కానీ ప్రస్తుతం ఈ భామ పెంగ్విన్  అనే చిత్రం కోసం తన రూపం మార్చేసింది. మరి ఇప్పుడు ప్రిన్స్ సినిమా లో ఏ విధంగా కనిపిస్తుందని అందరూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి మధ్య కాంబినేషన్ ఇదే మొదటిసారి అవ్వడం అభిమానుల్లో ఇంకా ఎక్కువ ఉత్సాహం నెలకొంది. ఆశ్చర్యం ఏమిటంటే కీర్తి సురేష్ నటించిన చిత్రం అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ రోజునే రిలీజ్ అయింది. ఇది ఒక హర్రర్, సస్పెన్స్ చిత్రంగా నిర్మించారు. ఈ సినిమాలో నటి కీర్తి సురేష్ నటన అభిమానులను మెప్పించే  విధంగా ఉంటుందని సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఈ సినిమా హిట్ అయితే వీరిద్దరి కాంబినేషన్ మీద ఇంకా ఎక్కువ ఊహాగానాలు, సర్కారు వారి పాట సినిమా మీద మరింత పాజిటివ్ టాక్ పెరుగుతోంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: