బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ బలవన్మరణం వెనుక ఉన్న కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సుశాంత్‌ స్టాఫ్‌, స్నేహితులు, కుటుంబసభ్యులను విచారించిన పోలీసులు పలు విషయాలు తెలుసుకున్నారు. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి మూడురోజుల ముందు సుశాంత్‌ తన స్టాఫ్‌కు జీతాలు చెల్లించాడని, కొద్దిరోజుల తర్వాత జీతాలు ఇవ్వడం తనకు కుదరదని ఆయన అన్నాడని కొంతమంది పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఓ వెబ్‌సిరీస్‌లో నటించమని కోరుతూ ఇటీవల సుశాంత్‌ తన మాజీ మేనేజర్‌ దిశాతో చర్చలు జరిపాడని హీరో ప్రస్తుత మేనేజర్‌ పోలీసులకు వెల్లడించాడు. దీంతో పోలీసులు సుశాంత్‌ ఫోన్‌ పరిశీలించగా.. ఆయన మార్చి నెలలో చివరిసారిగా దిశాతో వాట్సాప్‌ చాట్‌ చేసినట్లు తెలిసింది.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

@sushantsinghrajput You'll be missed forever🧡🧡🧡🧡🧡Watching this video made me cry coz being a victim of depression myself, I can feel what he must have went through...People often say speak up to your family, friends and seek medical help if you're going through depression.. Yes speaking up to family, friends and seeking medical attention do help but at times that feeling of being depressed do come back again and at the end it's only you who can help yourself.🙌🙌Either we choose to let the depression consume us or you choose to fight through all the odds and become victorious by overcoming depression✊✊Suicide is never an option🙏🙏🧡🧡🧡 #sushantsinghrajput

A post shared by @ asimhimanshi90 on

 

తన తల్లి మృతి అనంతరం ఒకానొక సమయంలో సుశాంత్‌ ఓ భావోద్వేగభరితమైన లేఖను రాశాడు. 2016లో రాసిన ఆ లేఖ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. "అమ్మా.. నీకు గుర్తుందా?నువ్వెప్పటికీ నాతోనే ఉంటానని మాటిచ్చావు, అలాగే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటానని నేను నీకు మాటిచ్చాను. కానీ ఇప్పుడు, మనిద్దరం తప్పని తెలుస్తోంది" అని సుశాంత్‌ లేఖలో పేర్కొన్నాడు.

 

సుశాంత్‌ సింగ్‌ బలవన్మరణంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో సుశాంత్‌కు సంబంధించిన ఎన్నో మధుర జ్ఞాపకాలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులు షేర్‌ చేస్తున్నారు. ఆయనకి సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ అభిమాని సుశాంత్‌ను గుర్తు చేసుకుంటూ ఓ ప్రత్యేక వీడియోను రూపొందించి నెట్టింట్లో పోస్ట్‌ చేశాడు. ఇప్పటివరకూ సుశాంత్‌ పోషించిన పాత్రలతో ఈ వీడియో రూపొందింది. సుశాంత్‌ అస్థికలను ఆయన కుటుంబ సభ్యులు గంగానదిలో కలిపారు. సుశాంత్‌ తండ్రి, సోదరితో పాటు, దగ్గరి బంధువులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: