వైజయంతి మూవీస్ బ్యానర్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాగ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా 50వ చిత్రంగా తెరకెక్కుతున్న తరుణంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు నిర్మాత అశ్వినీ దత్. ఈ నేపథ్యంలో సినిమాకి ఖర్చు ఏమాత్రం వెనకాడకుండా భారీగా డబ్బు పేట్టడానికి అశ్వినీదత్ రెడీ అయినట్లు, దాదాపు 400 కోట్లు పెట్టి పాన్ ఇండియా తరహాలో దేశంలో అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారట. దీంతో పూర్తిస్థాయి స్క్రిప్ట్ వర్క్ పనుల్లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిమగ్నమై ఉన్నారట. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే నటించనున్నట్లు సమాచారం.

IHG

ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కి మంచి మార్కెట్ ఉండటంతో దాన్ని దృష్టిలో పెట్టుకొని హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్ లతో ఈ సినిమా వర్క్ పనులు డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేయనున్నట్లు సమాచారం. కుదిరితే ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో కూడా రిలీజ్ చేయాలని డైరెక్టర్ నాగ్ అశ్విన్ భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ తో పాటుగా మరో టాలీవుడ్ హీరో నటించనున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

IHG's ...

దీనికి సంబంధించి పూర్తి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనున్నట్లు ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం. మొత్తంమీద వైజయంతి మూవీస్ బ్యానర్ వారు ప్రభాస్ పై భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టడానికి రెడీ అవుతున్నట్లు వస్తున్న వార్తలు బట్టి అర్థం అవుతుంది. ఇదిలా ఉండగా ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాధే శ్యాం' అనే టైటిల్ పెట్టాలని సినిమా యూనిట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: