మన తెలుగులో తక్కువ కాలంలోనే మంచి హీరో గా పేరు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా సరే ఏ మాత్రం నిర్మాతలను దర్శకులను తనకు ఉన్న స్టార్ ఇమేజ్ తో ఇబ్బంది పెట్టకుండా చక్కగా స్వేచ్చగా సినిమాలు చేస్తూ కెరీర్ లో ఇప్పుడు ముందుకు వెళ్తున్నాడు అని చెప్పాలి. అగ్ర హీరోల సినిమాల మాదిరిగా సినిమాలను చేస్తూ అతను ఇప్పుడు వరుసగా సినిమాలను చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అతని గురించి టాలీవుడ్ లో ఒక వార్త హాట్ టాపిక్ గా మారింది. 

 

అది ఏంటీ అంటే అతని సినిమాల్లో ఎక్కువ భాగం విదేశాల్లో సీన్ లు ఉంటాయి అనే సంగతి తెలిసిందే. అతని ఏ సినిమా చూసినా సరే మనకు అదే విషయం స్పష్టంగా అర్ధమవుతు ఉంటుంది. ఇప్పుడు ఆ విధానం మార్చుకున్నాడు అని సమాచారం. గతంలో అతని సినిమాలు అనగానే ఎక్కువగా రిచ్ కార్ లు అమెరికా లేదా విదేశాల్లో షూటింగ్ లు వంటివి ఎక్కువగా ఉండేవి. కాని ఇప్పుడు మాత్రం ఆలా ఏమీ లేదని అతను తక్కువ బడ్జెట్ లో చేయడానికి చూస్తున్నాడు అని అంటున్నారు. అవును అతను విదేశాల్లో అసలు షూటింగ్ వద్దు అని చెప్పినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి. అది నిజమా కాదా అనేది తెలియదు గాని ఇటీవల అయితే దీనిపై చర్చలు కూడా జరిగాయి. 

 

ఇప్పుడు అతను చేసే సినిమా షూటింగ్ ని విదేశాల్లో రద్దు చేసారు అని సమాచారం. అగ్ర హీరో మాదిరిగా ఉండే సినిమాలను ఇప్పుడు ఉన్న పరిస్థితుల ఆధారంగా అతను తగ్గించుకున్నాడు అని తెలుస్తుంది. మరి చూడాలి అతను ఏ విధంగా సినిమాలు చేస్తాడు అనేది. ఇప్పుడు లాక్ డౌన్ లో బాగా ఖాళీ గా ఉన్నాడు వరుణ్ తేజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: