టాలీవుడ్ లో అయినా మరో భాషలో అయినా సరే యష్ హీరో గా వచ్చిన కేజీ ఎఫ్ సినిమా ఒక సంచలనం. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. మొదటి భాగం సంచలన౦ సృష్టించిన నేపధ్యంలో ఇప్పుడు రెండో భాగం మీద ఎక్కువగా ఫోకస్ చేసారు. ఈ రెండో భాగం ఎప్పుడు వస్తుందా అని అటు బాలీవుడ్ జనాలు కూడా పనులు మానుకుని మరీ చూస్తున్నారు అనే టాక్ ఎక్కువగా వినపడుతుంది. అవును బాలీవుడ్ లో ఈ సినిమా కోసం కొందరు సినిమాలు ఆపేశారు. అవును సల్మాన్ ఖాన్ కి యష్ తో పాటుగా ప్రశాంత్ నీల్ తో కలిసి ఒక సినిమా చెయ్యాలి అనే ఆలోచన ఉంది అని సమాచారం. 

 

దీనితో యష్ ని అలాగే  ప్రశాంత్ నీల్ ని అతను కలిసాడు అని టాక్. ప్రాజెక్ట్ ని ఓకే చేసాడు అని దాని కోసం అతను వచ్చే ఏడాది విడుదల చేసే రెండు సినిమాలను వాయిదా వేసాడు అని సమాచారం. ఒక సినిమాను జనవరి లో మొదలు పెట్టాలి అని సల్మాన ఖాన్ భావించాడు. కాని అది యష్ తో చేసే సినిమా కోసం వాయిదా వేసాడు అని తెలుస్తుంది. యష్ తో సినిమా విషయంలో ఇప్పటికే అతను ఒక ప్లాన్ రెడీ చేసాడు అని  దానికి టైటిల్ కూడా ఏ విధంగా ఉండాలి అనేది చెప్పాడు అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

ఇప్పుడు యష్ ఒక సినిమాను తెలుగు లో కూడా చేస్తున్నాడు అనే ప్రచారం అయితే టాలీవుడ్ వర్గాల్లో జరుగుతుంది మరి. మరి ఎప్పుడు ఈ సినిమా చేస్తాడో తెలియదు. ఎన్టీఆర్ తో ఒక సినిమాను ప్లాన్ చేసాడు యష్ అని అంటున్నారు. చూడాలి మరి ఏ విధంగా ఈ ప్రాజెక్ట్ వస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: