గుణశేఖర్ గత సంవత్సరం రానా దగ్గుబాటితో హిరణ్య కశిప సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. భారీ కాన్వాయిస్ తో ఈ సినిమాని 120 కోట్ల భారీ బడ్జెట్ తో  రూపొందించాలన కున్నారు. ఈ సినిమాకోసం గుణశేఖర్, సురేష్ బాబు చాలా శ్రమిస్తున్నారు కూడా. అంతేకాదు ఈ సినిమాలో గుణశేఖర్ కూడా భాగస్వామి అన్న విషయం తెలిసిందే. 

 

కాని కొంతకాలంగా ఈ సినిమా కి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని గత కొంతకాలంగా మాట్లాడుకుంటున్నారు. కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల దృష్ఠ్యా ఇక ఈ సినిమా ఉండదని ప్రచారం మొదలైంది. ఈ ప్రచారానికి నిర్మాత సురేష్ బాబు వెంటనే స్పందిస్తూ ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని ఈ సినిమా మీద వస్తున్నవన్ని ఒట్టి పుకార్లేనని క్లారిటి కూడా ఇచ్చారు. అందుకు కారణం కరోనాతో నెలకొన్న పరిస్థితులు చక్కబడతాయనుకున్నారు.

 

అయితే తాజాగా ఈ సినిమాని అర్థాంతరంగా నిలిపివేస్తున్నట్టు సురేష్ బాబు దర్శకుడు గుణశేఖర్ కి తెలిపాడాట. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత దారుణంగా మారబోతున్నందునే సురేష్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సురేష్ బాబు నిర్మాణంలో తమిళ అసురన్ కి రీమేక్ గా నారప్ప ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటిస్తూ రీ ఎంట్రీ ఇస్తుంది.

 

అలాగే రానా హీరోగా విరాట పర్వం అన్న సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఎలాగోలా ఈ రెండు సినిమాలనే కంప్లీట్ చేయాలనిఉ భావిస్తున్నారట. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని ఇన్నాళ్ళు భారీగా సనాహాలు చేసిన హిరణ్య కశిప తో పాటు బాలీవుడ్ సినిమాలని రీమేక్ చేయాలని అనుకున్న ప్రాజెక్ట్ ని పక్కన పెట్టారట. ఇక ఇప్పటికే హిరణ్య కశిప మీద సురేష్ బాబు 10 కోట్లు ఖర్చు చేశారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: