2020 ప్రారంభంలోనే వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తన 27 వ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 31 న టైటిల్ తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి అధికారకంగా సినిమాని అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని జీ.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా డిమాడ్ ఉన్న థమన్ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నాడు. 

 

ఇక సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన 24 గంటల్లో గతంలో లేని విధంగా సోషల్ మీడియాలో అత్యధిక వ్యూస్ ని సాధించి రికార్డ్ సాధించింది. ఒక్క ఫస్ట్ లుక్ తోనే ఈ స్థాయి రికార్డ్ సాధించడంతో ఈ సినిమా మీద పోకిరి సినిమా స్థాయిలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన చిత్ర బృందం ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది సస్పెన్స్ లో ఉంచారు.

 

అయితే తాజా గా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తున్నట్టు దాదాపు కన్‌ఫర్మ్ అన్న న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతోంది. కాని అందులో వాస్తవం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. మహేష్ బాబు సతీమణి నమ్రత కి అత్యంత సన్నిహితంగా ఉండే సాయి మంజ్రేకర్ ని చిత్ర బృందం ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట. అయితే ఫ్యాన్స్ మాత్రం కీర్తి సురేష్ అయితే బావుంటుందన్న ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారన్న వార్త ఇప్పుడు మేకర్స్ ని డైలమాలో పడేసింది. మరి చివరికి సర్కారు వారి పాటలో నటించే ఆ లక్కీ హీరోయిన్ ఎవరో త్వరలో క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమాని 2021 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు పరశురాం ప్లాన్ చేస్తున్నాడట.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: