పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు వార్తలు అందుతున్నాయి. తెలుగు సినిమా రంగంలో కమెడియన్ గా ప్రేక్షకులను అలరించిన నిర్మాతగా రాణించడం జరిగింది. పౌల్ట్రీ వ్యాపారాలు చేస్తూ వ్యాపారంలో మంచి సక్సెస్ సాధించడంతో బండ్ల గణేష్ తెలుగు సినిమా రంగంలో భారీ భారీ ప్రాజెక్టులు స్టార్ హీరోలతో చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ తో 'గబ్బర్ సింగ్', ఎన్టీఆర్ తో 'బాదుషా' ఇంకా చాలా సినిమాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల బండ్ల గణేష్ హెయిర్ ప్లాంటేషన్ చేయించుకుందామని డాక్టర్ల వద్దకు వెళ్లగా మొదట కరోనా టెస్ట్ చేయించుకోవాలి అని సూచించారట.

IHG

దాంతో ఆయన కరోనా టెస్ట్ పరీక్షలు చేయించుకోవటంతో పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ కుటుంబ సభ్యులతో పాటు ఆయనతో సన్నిహితంగా ఉన్నవాళ్లు కూడా టెస్టులు చేయించుకున్నట్లు సమాచారం. ఈ వార్త బయటపడగానే అటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇటీవల ఇండస్ట్రీ లో ఎవరెవరు బండ్ల గణేష్ తో కలిశారో వాళ్లలో టెన్షన్ మొదలైనట్లు సమాచారం.

IHG

ఇదే సమయంలో అధికారులు బండ్ల గణేష్ గత రెండు వారాల నుండి ఎవరెవరిని కలిశారో ఎక్కడెక్కడికి వెళ్లారో వంటి వివరాలను అడిగి తెలుసుకుంటున్నరట. ప్రస్తుతం బండ్ల గణేష్ ని క్వారంటైన్ కి తీసుకెళ్ళి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. హైదరాబాదు మరియు శంషాబాద్ సహా షాద్‌నగర్ వైపు ప్రాంతాల వైపు ఎక్కువగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడటంతో బండ్ల గణేష్ కి కరోనా సోకినట్లు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: