బయోపిక్ ల కాలం మొదలైంది. బాగా ప్రాచుర్యం పొందిన వ్యక్తి మరణించిన తర్వాత లేదా అనేక వివాదాల మధ్య మరణించిన వ్యక్తి గురించి సినిమాలు తీయడం నేడు ఒక ట్రెండ్ గా మారింది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీ తారలు గురించి సినిమాలు తీయడం వలన అభిమానుల్లో చిన్ని ఆశలు మొదలు అవుతున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ లో ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. యువనటుడు సుశాంత్ సింగ్ జీవితం ఆధారంగా బాలీవుడ్​లో సినిమా తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్​ను విడుదల చేశారు.

 

యువహీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య.. బాలీవుడ్​లో నెపోటిజమ్​తో పాటు ఉన్న పలు అంశాల్ని లేవనెత్తింది. ఈ నటుడు చనిపోవడానికి ఇండస్ట్రీలోని పలువురు బడా ప్రముఖులే​ కారణమని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ జీవితం ఆధారంగా సినిమా తీసేందుకు దర్శకుడు షమీక్ మాలిక్ సిద్ధమయ్యారు. 'సుసైడ్ ఆర్ మర్డర్: ఏ స్టార్ వస్ లాస్ట్' పేరుతో తీస్తున్న చిత్ర పోస్టర్​ను విడుదల చేశారు. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్​లోకి అడుగుపెట్టిన వారు, ఎలాంటి కష్టాలు అనుభవిస్తారనే విషయాన్ని ఇందులో చూపించనున్నట్లు వెల్లడించారు.

 

" ఇది సుశాంత్ సింగ్ బయోపిక్​ కాదు. బాలీవుడ్​లోని ఎవరికి తెలియని కొన్ని విషయాల్ని ఇందులో చూపించబోతున్నాం. అతడు చనిపోవడానికి కారణమైన వారి గురించి చెప్పనున్నాం. గత కొన్నాళ్లలో సుశాంత్​ను బెదిరించడం, నిషేధించడం సహా పలు సినిమాల నుంచి తప్పించారు" అని దర్శకుడు షమీక్ మాలిక్ తెలియచేసాడు.

 

మానసిక ఒత్తిడిని తట్టుకోలేక జూన్ 14న, తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు సుశాంత్ సింగ్. సుసైడ్ నోట్ దొరకకపోవడం వల్ల ఇతడితో సంబంధమున్న పలువుర్ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని ఇప్పటికే ప్రశ్నించగా, అతడితో చేసుకున్న కాంట్రాక్టుల వివరాలు ఇవ్వాలని యశ్​రాజ్ ఫిల్మ్స్​కు పోలీసులు లేఖ రాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: