మన తెలుగులో డాన్స్ విషయంలో అయినా సరే నటన విషయంలో అయినా సరే హీరోయిన్ లు వెనకడుగు వేస్తూ ఉంటారు బాలీవుడ్ హీరోయిన్ లతో పోలిస్తే మన వాళ్ళకు నటన అంతగా రాదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. చాలా వరకు నటనలో ఫెయిల్ అవుతూ ఉంటారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఇక నుంచి స్టార్ హీరోలతో చేసే హీరోయిన్ లు కచ్చితంగా  నటన తో పాటుగా ప్రతీ ఒక్కటి ఉండాలి అని లేకపోతే మాత్రం వాళ్ళు అవసరం లేదు అని చెప్తున్నారట. 

 

ఇటీవల మహేష్ సినిమా విషయంలో పరుశురాం తో పాటుగా చిత్ర యూనిట్ అదే విషయం చెప్పింది అని సమాచారం. మరి అది ఎంత వరకు నిజం అనేది తెలియదు. ఇక పుష్ప సినిమా విషయంలో బన్నీ హీరోయిన్ కి ఇదే విషయం చెప్పాడు అని టాక్. గ్లామర్ కాదు నటన చాలా అవసరం అని చెప్పినట్టు తెలుస్తుంది. ఏ విధంగా అయినా సరే నటన విషయంలో ముందు ఉండాలి అని అలా అయితేనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అని బన్నీ ఆమెకు స్పష్టంగా చెప్పాడు అని సమాచారం. ఆమె కూడా అందుకు ఓకే చెప్పింది అని టాక్. 

 

ఇక పూజకు కూడా ప్రభాస్ ఇదే విషయాన్ని చెప్పాడట. పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నామని నటన ఉంటేనే సినిమాలను జాతీయ స్థాయిలో ఆదరించే పరిస్తితి ఉంటుంది అని కాబట్టి అందరూ అర్ధం చేసుకుని నటన మీద దృష్టి పెట్టాలి అని పలువురు హీరోలు హీరోయిన్ లను కోరే అవకాశాలు కనపడుతున్నాయి అని అంటున్నారు ఇప్పుడు మరి. ఎం జరుగుతుంది అనేది చూడాలి. ఇప్పుడు హీరోలు అందరూ లాక్ డౌన్ లో ఖాళీ గా ఉన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: