టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా మంచి ఇమేజ్ తెచ్చుకుంది నిత్యా మీనన్. వరుస గా సినిమాలు చేసినా లేకపోయినా సరే ఆమెకు మాత్రం మంచి గుర్తింపు అనేది మన తెలుగులో వచ్చింది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అగ్ర హీరోల సినిమాల్లో మంచి పాత్రలు చేస్తూ కెరీర్ లో ఆమె ఒక రేంజ్ లో హిట్స్ కొట్టింది అనే చెప్పాలి. ఏ హీరో సినిమా అయినా సరే ఆమె పాత్ర ఆమెకు కచ్చితంగా ఉండేది కొన్ని కొన్ని సినిమాల్లో. ఇక ప్రధాన హీరోయిన్ గా మాత్రం ఆమె పెద్దగా రాణించలేదు అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆమె గురించి ఒక వార్త హాట్ టాపిక్ గా అయింది. 

 

అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే ఆమె లాక్ డౌన్ లో ఇప్పుడు చాలా ఖాళీ గా ఉంది అని సమాచారం. లాక్ డౌన్ లో ఆమె సినిమాలు చేసే విషయంలో ఇప్పుడు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుని చేస్తుంది అని టాక్ వినపడుతుంది. అది అలా ఉంటే ఇప్పుడు ఆమె రచయిత గా మారింది అని సమాచార౦. ఆమె ఇప్పుడు ఒక కథ రాస్తుంది అని సినిమా చేయడానికి రెడీ అయింది అని టాక్. అది ఒక బయోపిక్ అని సమాచారం. విజయ నిర్మల బయోపిక్ అని కొందరు అంటున్నారు. కీర్తి సురేష్ తో కలిసి పని చేయడానికి ఆమె రెడీ అయింది అని సమాచారం. 

 

ఆమెకు నరేష్ కథ కూడా చెప్తున్నారు అని తెలుస్తుంది. మరి అది ఎంత వరకు నిజం అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ లో కూడా వరస అవకాశాలు వస్తున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి ఆమె ఏ విధంగా దర్శకత్వం వహిస్తుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: