ఒకప్పుడు టాలీవుడ్ లో కొంత మంది హీరోయిన్ ల కోసం చాలా ఎదురు చూసే పరిస్థితి ఉండేది అనే మాట అందరికి తెలిసిందే. అగ్ర హీరోల సినిమాల్లో చేసే హీరోయిన్ లకు గతంలో మంచి డిమాండ్ అనేది ఉండేది. అగ్ర హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరి తో వాళ్ళు సినిమాలు చేసే వారు. స్టార్ ఇమేజ్ ఉన్నా లేకపోయినా సరే ఈ విషయంలో మాత్రం ఎక్కడా ఇబ్బంది పడకుండా చేసే వారు. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి ఆ విధంగా అసలు లేదు అని అంటున్నారు టాలీవుడ్ జనాలు. స్టార్ హీరోలుగా ఉన్న వారి తోనే సినిమాలు చేయడానికి కొందరు రెడీ అవుతున్నారు. 

 

అందులో ప్రధానంగా చెప్పుకునే హీరోయిన్ లు ఇద్దరు ఉన్నారు. రష్మిక మంధన అదే విధంగా పూజ హెగ్డే. వీరు ఇద్దరూ కూడా ఇప్పుడు స్టార్ హీరోలు అయితే మాత్రమే సినిమాలు చేస్తాము అని చెప్తున్నారు అని సమాచారం. అగ్ర హీరోలతోనే సినిమాలు చేస్తే తమకు ఇబ్బంది  లేదని కాని చిన్న హీరోలతో సినిమాలు చేస్తే అది క్రమంగా ఇబ్బందికి దారి తీస్తుంది అని వారు ఇద్దరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అక్కడికి వెళ్లి పారితోషికం తగ్గించుకోవాలి అని అదే పెద్ద హీరో తో అయితే ఏ ఇబ్బంది ఉండదు అని అంటున్నారట. 

 

ఇటీవల పూజ హెగ్డే ని నితిన్ సినిమాలో తీసుకోవాలి అని చూస్తే ఆమె రెండు కోట్లు అడిగింది అని కాని అది తాము ఇవ్వలేము అని చెప్పడం తో ఆమె పక్కకు వచ్చింది అని అంటున్నారు. నానీ తో రష్మిక ను అడిగినా సరే ఆమె కూడా చేయడానికి అంతగా ఆసక్తి చూపించలేదు అని అంటున్నారు మరి. అది ఎంత వరకు నిజం అనేది చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి: