ప్రగ్యా జైస్వాల్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 2014లో తమిళ మరియు తెలుగు ద్విభాషా చిత్రం ‘డేగ’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ప్రగ్యా జైస్వాల్. ఆ తరవాత ‘టిట్టూ ఎంబీఎ’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్లోకి ఎంటరిచ్చింది. అలా ఒకే సంవత్సరంలో తమిళం, తెలుగుతో పాటు హిందీలో కూడా తెరంగేట్రం చేసింది.
ఇక 2015లో వచ్చిన `మిర్చి లాంటి కుర్రాడు` సినిమాతో తెలుగు సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటి. ఆ తరువాత జాతీయ పురస్కారం అందుకున్న ‘కంచె’ సినిమాలో చీరకట్టుతో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది ప్రగ్యా జైస్వాల్. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన నటించినా ప్రగ్యా స్టార్డమ్ను సంపాదించలేకపోయింది.
ఇక ప్రగ్యా చివరిగా నటించిన సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’. ఈ సినిమా పెద్ద డిజాస్టర్. ఈ సినిమా తరవాత మరే సినిమాలో ప్రగ్యా నటించలేదు. నిజం చెప్పాలంటే ఆమెకు అవకాశాలు రాలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈమెకు ఫాలోంగ్ బాగానే ఉంది.
మత్తెక్కించే అందాలతో ఈ బ్యూటి తన అభిమానులను బాగానే ఆకట్టుకుంటుంది. తాజాగా కూడా హాట్ హాట్ అందాలతో ప్రగ్నా రెచ్చిపోయిందని చెప్పాలి. అవి చూస్తుంటే నిజంగా నిద్ర పట్టడం కష్టమనే అంటారు కుర్రకారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్గా మారాయి.