సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరి పై పంజా విసురుతు శర వేగంగా వ్యాప్తి చెందుతుంది మహమ్మారి కరోనా వైరస్. ప్రస్తుతం సామాన్య ప్రజలకే కాదు ఎమ్మెల్యేలు మంత్రులు క్రికెటర్ లు సైతం ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్నారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రం ఇప్పటివరకు ఎవరూ కూడా కరోనా బారిన పడ లేదు అని అనుకుంటున్న తరుణంలో ప్రముఖ నిర్మాత నటుడు బండ్ల గణేష్ కరోనా వైరస్ బారిన పడడం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సంచలనం గా మారిపోయింది.కరోనా సెగ టాలీవుడ్ ను తాకడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
బండ్ల గణేష్ కి కరోనా రావడంతో అంతా అలర్ట్ అయిపోయాడు. అయితే బండ్ల గణేష్ గత కొన్నిరోజుల నుండి పలువురిని కలిశాడు... దీంతో ఈ మహమ్మారి వైరస్ టాలీవుడ్ లో ఎంత మందికి విస్తరిస్తుందో అనే అనుమానాలు కూడా ప్రస్తుతం రేకెత్తుతున్నాయి. ఇక బండ్ల గణేష్ కి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో యువహీరో నాగశౌర్య, ఆయన కుటుంబం మొత్తానికి టెన్షన్ పట్టుకుంది అని ప్రస్తుతం టాలీవుడ్ టౌన్లో టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే బండ్ల గణేష్ ఉండే వీధిలోని నాగశౌర్య ఫ్యామిలీ కూడా నివాసం ఉంటుంది.
ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ తమ వీధిలో ఎవరిని కలిశాడో.. వారిని నాగశౌర్య కుటుంబం కూడా కలిసిందా అనే అనుమానం మొదలైంది. దీంతో నాగశౌర్య కుటుంబానికి కూడా కరోనా భయం పట్టుకుంది అనే టాక్ వినిపిస్తోంది. ఇక బండ్ల గణేష్ కి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగానే అక్కడినుంచి నాగశౌర్య కుటుంబం వేరేచోటికి షిఫ్ట్ అయిపోయారు అనే సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. అంతేకాకుండా బండ్ల గణేష్ కి కరోనా పాజిటివ్ అని తెలియగానే మరికొంతమంది టాలీవుడ్ ప్రముఖులు కూడా కాస్త అలెర్ట్ ఐపోయినట్టు తెలుస్తోంది.