ఇప్పుడు హీరోయిన్ లు అవకాశాల కోసం చాలా కష్టపడే పరిస్థితి అయితే మన తెలుగులో ఉంది అని చెప్పాలి. అగ్ర హీరోల సినిమాల్లో అయినా చిన్న హీరోల సినిమాల్లో అయినా సరే హీరోయిన్ లు ఇప్పుడు అవకాశాల కోసం ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. హీరోయిన్ లు అవకాశాల కోసం గానూ ఎక్కువగా ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నారు అనే ప్రచారం జరుగుతుంది. అవును ఇప్పుడు వాళ్ళు తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెప్పాలి అని భావిస్తున్నట్టు సమాచారం. 

 

కీర్తి సురేష్ కి తెలుగు మీద కాస్త అవగాహన ఉంది. ఇక పూజ హెగ్డే రష్మిక మందన నభా నటేష్ సహా కొందరు హీరోయిన్ లు ఇప్పుడు తెలుగు మీద ఫోకస్ చేసారు అని సమాచారం. బాలీవుడ్ మాదిరిగా ఇక్కడ కూడా డబ్బింగ్ ని తామే చెప్పుకోవాలి అని భావిస్తున్నారు. మరి అది ఎంత వరకు ఫలిస్తుంది వాళ్లకు అవకాశాలు డబ్బింగ్ చెప్పుకునే విధంగా వస్తాయా లేదా అనేది చూడాలి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక హీరోయిన్ ఏకంగా తెలంగాణా పల్లెల్లో ఉండి అక్కడ ట్రైనర్ తో తెలంగాణా యాస కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. 

 

పుష్ప సినిమా కోసం కూడా ఇప్పుడు రష్మిక మంధన అదే విధంగా ప్రయత్నాలు చేస్తుంది అని ఆమె చిత్తూరు జిల్లాలో ఉంటుంది అని టాక్. రష్మిక బెంగళూరు నుంచి ఇటీవల చిత్తూరు వచ్చింది. అక్కడే ఆమె ఈ భాష నేర్చుకుంటుంది అని సమాచారం. బాలీవుడ్ లో మాదిరిగా ఎక్కువ కాలం ఉండాలి అంటే కచ్చితంగా తెలుగు నేర్చుకోవాలి అని అప్పుడే కెరీర్ ఉంటుంది అని వాళ్ళు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఎం జరుగుతుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: