కన్నడ బ్యూటి రష్మిక మందన్న సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో 2020 ప్రారంభంలోనే బ్లాక్ బస్టర్ ని అందుకుంది. చెప్పాలంటే ఈ సినిమాతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరింది. ఈ సినిమా సక్సస్ మర్చిపోకముందే యంగ్ హీరో నితిన్ సరసన నటించిన భీష్మ తో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇలా మరే హీరోయిన్ దక్కించుకోలేని బ్యాక్ టు బ్యాక్ రెండు సక్సస్ లు అందుకొని అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప సినిమాలో గోల్డెన్ ఛాన్స్ అందుకుంది.

 

సినిమా అయిదు భాషల్లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇదే ఊపుతో తమిళంలోను రష్మిక మందన్న కార్తీ సినిమాలో అవకాశం దక్కించుకుంది. సుల్తాన్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి బక్కియరాజ్ దర్శకత్వం వహిస్తుండగా ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించబోయో కొత్త ప్రాజెక్ట్ లో ఛాన్స్ అందుకుందట ఈ కన్నడ బ్యూటి. గత సంవత్సరం నుంచి కోలీవుడ్ లో అవకాశాలు దక్కించుకోవాలని రష్మిక చేసిన విశ్వ ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయి.

 

విజయ్ ఏ ఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందబోయో సినిమాలో నటించే ఛాన్స్ అందుకొని తెగ సంబరపడుతుందట. ఇంతక ముందు ఒకసారి విజయ్ సరసన నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి మిస్ అయింది. అదే త్వరలో రిలీజ్ కాబోతున్న మాస్టర్ సినిమా. ఆ సినిమా మిస్ అయినా  మరోసారి విజయ్ సినిమాలో లక్కి ఛాన్స్ అందుకుంది. 

 

ఇక ఈ స్టార్ హీరో నటించిన తాజా చిత్రం మాస్టర్ రిలీజ్ కి ముందే 200 కోట్ల బిజినెస్ జరిగింది. జూలై లేదా ఆగస్టు లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ మురగదాస్ ల సినిమా మొదలవబోతుందట. మొత్తానికే తెలుగు తమిళం లో రష్మిక చేసుకున్న ప్లాన్స్ మిగతా హీరోయిన్స్ కి లేకపోయో అంటూ కొందరు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: