కీర్తి సురేష్ లేటెస్ట్ ‘పెంగ్విన్’ ను ప్రమోట్ చేస్తూ మహేష్ తో తాను చేయబోతున్న లేటెస్ట్ మూవీ గురించి ఇచ్చిన లీకులు మహేష్ అభిమానులను భయపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొన్న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ‘పెంగ్విన్’ మూవీలోని కీర్తి సురేష్ నటనకు ప్రశంసలు లభిస్తున్నా ఆమె లుక్ చూసి చాలామంది ఆమెకు ఏమైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


ముఖ్యంగా గతంలో ‘నేను శైలజ’ ‘నేను లోకల్’ సినిమాలలో కీర్తి సురేశ్ లో కనిపించిన గ్లామర్ ఏమైంది అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి కీర్తి ‘మహానటి’ సినిమా కోసం ఆ సినిమాలో ఆమె నటించిన సావిత్రి పాత్ర కోసం లావైన విషయం తెలిసిందే. అయితే ఆ మూవీ తరువాత కీర్తి తన బరువును తగ్గించుకోవడానికి విపరీతంగా డైటింగ్ చేయడంతో ఆమె సన్నపడింది కాని మోహంలో గ్లో అంతా పోయింది.


ఈవిషయం మరింత స్పష్టంగా ‘పెంగ్విన్’ మూవీలో కనిపించడంతో కీర్తి అభిమానులలో ఖంగారు మొదలైంది. దీనికితోడు ఈ మూవీలో ప్రెగ్నెంట్ లేడీ పాత్రను పోషించడంతో ఆమె తన లుక్ కంటే నటనకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. అయితే ఈ విషయాలు పట్టించుకోకుండా మహేష్ అభిమానులు కీర్తి లేటెస్ట్ లుక్ ను చూసి భయపడుతూ ఆమె మహేష్ పక్కన ‘సర్కారు వారి పాట’ మూవీలో ఏమి బాగుంటుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


ఇది ఇలా కొనసాగుతూ ఉండగా ‘మహానటి’ తో పీక్ కు వెళ్ళిన కీర్తి క్రేజ్ ఆతరువాత ఆమె నటించిన సినిమాలు పెద్దగా విజయవంతం కాకపోవడంతో ఆమె మ్యానియా నెమ్మదిగా తగ్గుతోంది. ‘పెంగ్విన్’ మూవీ పై సగటు ప్రేక్షకుడు పెదవి విరచిన పరిస్థితులలో ఆమె తదుపరి సినిమాలు ‘మిస్ ఇండియా’ ‘రంగ్ దే’ సక్సస్ ను బట్టి ఆమె క్రేజ్ ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం ఇమేజ్ రీత్యా నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కుంటున్న కీర్తి సురేష్ ను మహేష్ ధైర్యంగా ఈ నెగిటివ్ ప్రచారాన్ని పట్టించుకోకుండా తన ‘సర్కారు వారి పాట’ మూవీలో హీరోయిన్ గా కొనసాగిస్తాడా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్..

మరింత సమాచారం తెలుసుకోండి: