ఫిదాతో మరోసారి తన సత్తా చాటిన డైరక్టర్ శేఖర్ కమ్ముల తన నెక్స్ట్ సినిమాను నాగ చైతన్య, సాయి పల్లవి కాంబోలో లవ్ స్టోరీ అంటూ వస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందని తెలుస్తుంది. నాగ చైతన్య తెలంగాణా యాసలో మాట్లాడతాడని తెలుస్తుంది. లవ్ స్టోరీలో సాయి పల్లవి మరోసారి తన అభినయంతో మెప్పిస్తుందని అంటున్నారు. ఫిదా సినిమా ఆ రేంజ్ లో హిట్ అయ్యేందుకు సాయి పల్లవి ఎంతో ప్లస్ అయ్యింది. ఇప్పుడు అదే మ్యాజిక్ ఈ సినిమాకు రిపీట్ చేసేలా ప్లాన్ చేశాడు శేఖర్ కమ్ముల. 

 

ఇక అక్కినేని హీరో నాగ చైతన్య కూడా లాస్ట్ ఇయర్ మజిలీ, వెంకీమామ సినిమాల హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పుడు లవ్ స్టోరీతో హ్యాట్రిక్ హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి మాత్రమే కాదు నాగ చైతన్య కూడా తన యాసతో మెప్పిస్తాడని అంటున్నారు. ప్రస్తుతం థియేటర్లు మూసి ఉన్న కారణంగా ఈ సినిమా కూడా ఓటిటి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఆల్రెడీ అమేజాన్ నుండి ఈ సినిమాకు ఫ్యాన్సీ ఆఫర్ వచ్చిందట. చిత్ర దర్శక నిర్మాతలు ఓకే అంటే త్వరలోనే లవ్ స్టోరీ అమేజాన్ లో వస్తుందని చెప్పొచ్చు.

 

అయితే సినిమాను ఓటిటి రిలీజ్ చేస్తే హీరోల మార్కెట్ కు దెబ్బ తింటుందని కొందరు అంటున్నమాట. అందుకే మీడియం బడ్జెట్ హీరోలు కూడా ఓటిటి రిలీజ్ కు అంతగా ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఇంతకీ లవ్ స్టోరీ ఓటిటి రిలీజ్ ఉన్నట్టా లేనట్టా.. అమేజాన్ ప్రైం ఎంత పెట్టి లవ్ స్టోరీ కొనాలని అనుకుంటున్నారు. కేవ్లం ఓటిటితోనే లవ్ స్టోరీ లాభాలు తెస్తుందా.. ఈ సినిమాకు శాటిలైట్ రైట్స్ డిమాండ్ ఎలా ఉంది లాంటి విషయాల గురించి త్వరలో ఓ క్లారిటీ రానుంది. అప్పటివరకు ఈ కన్ ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: