టాలీవుడ్ లో మెగా డాటర్ నిహారిక  విషయంలో ఎప్పుడు ఏదోక వార్త హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఆమె సినిమాలు చేసినా లేకపోయినా సరే ఆమె గురించి మాత్రం టాలీవుడ్ జనం ఏదొకటి రాస్తూ ఉంటారు. ఇక మీడియా కూడా దానికి ప్రాధాన్యత బాగానే ఇస్తూ ఉంటుంది. తాజాగా ఆమె పెళ్లి కుదిరిన నేపధ్యంలో ఇప్పుడు టాలీవుడ్ మొత్తం కూడా పెళ్లి కొడుకు చైతన్య జొన్నలగడ్డ గురించి, నిహారిక గురించే మాట్లాడుకుంటుంది అని చెప్పవచ్చు. వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అనేది ఇంకా స్పష్టత రాలేదు.

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆమె సినిమాలకు దూరం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఏడాదికో రెండేళ్ళకో ఒక సినిమాను చాలా స్లో గా చేస్తూ వచ్చే ఆమె... ఇప్పుడు అసలు పెళ్లి తర్వాత సినిమాలు వద్దు, వెబ్ సీరీస్ లు ముద్దు అంటుందని టాలీవుడ్ జనాల మాట.  ఆమె ఇప్పటికే రెండు మూడు వెబ్ సీరీస్ లు చేసి అలరించింది. సైరా సినిమాలో కాసేపు కనపడింది. పవన్ కళ్యాణ్ సినిమాలో ఆమెకు అవకాశం వచ్చింది అని టాక్ కూడా వినపడింది ఫిలిం నగర్ లో. ఇక ఇప్పుడు ఆమె అసలు వెబ్ సీరీస్ ల మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తుందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. 

 

ఇందుకోసం కథలను కూడా ఆమె రెడీ చేసుకుంటుంది అని సమాచారం. పింక్ ఎలిఫెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన నిహారిక ఇప్పుడు భర్త ప్రోత్సాహంతో వెబ్ సీరీస్ లను తీసుకు రావాలి అని భావిస్తుంది. పరుచూరి బ్రదర్స్ ని కూడా ఒక కథ అడిగింది అని దానికి వాళ్ళు కూడా ఓకే చెప్పారు అని టాక్. చూడాలి మరి ఆమె ఎన్ని వెబ్ సీరీస్ లు చేస్తుంది అనేది... పెళ్లి ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో ఉండే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: