ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య ఎప్పుడు బిజీ బిజీగా ఉండే క్రికెటర్లను ప్రస్తుతం ఇంటికే పరిమితమై ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు క్రికెట్లో సూపర్ స్టార్ గా నిరూపించుకున్న డేవిడ్ వార్నర్ కరోనా సంక్షోభం కాలంలో టిక్ టాక్ ద్వారా వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో సూపర్ స్టార్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు పాటకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ తెలుగు ప్రజలందరికీ ఎంతగానో దగ్గరయ్యారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ టిక్ టాక్ వీడియోలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయం చెప్పుకొచ్చారు.
ప్రజల ముఖంపై చిరునవ్వులు తేవడానికి ఈ ప్రయత్నం చేసినట్లు డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు... ఇక కరోనా కష్ట సమయాల్లో ప్రజల ముఖంపై చిరునవ్వులు తీసుకురావడానికి టిక్ టాక్ వీడియోలను నా కుటుంబ సభ్యులతో చేశాను అంటూ డేవిడ్ వార్నర్ తెలిపాడు. అనంతరం ఇంటర్వ్యూలో భారతీయ సినిమాలపై స్పందించాలని కోరగా... ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.
నిజంగా చెప్పాలి అంటే అక్కడ మీరు పేర్కొనే బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ అంటే ఏమిటి.... ఇందులో చాలా విషయాలు ఉన్నాయి... అయితే తొలుత మేము అభిమానుల తో ముచ్చటించి వారికి ఏమి కావాలి అనే విషయాన్ని అడిగేవాళ్ళం. ఈ క్రమంలో నే టిక్ టాక్ లో ఎంతోమంది తమ అభిప్రాయాలు చెప్పే వాళ్లని... అల నేను చేసిన బుట్ట బొమ్మ డాన్స్ ఆ తర్వాత వరుసగా వీడియోలు చేయటం జరిగింది అంటూ చెప్పుకొచ్చారు డేవిడ్ వార్నర్. అభిమానులు అడిగిన అన్ని పాటలకు దాదాపుగా డాన్సులు చేసే అలరించామూ అంటూ తెలిపాడు. అయితే భారతీయ స్టెప్పులు ఎంతో కష్టంగా ఉంటాయి అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.