దక్షిణాది ప్రేమజంట​ నయనతార-విఘ్నేశ్​ల​కు కరోనా సోకిందని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన వారి సన్నిహితులు అవన్నీ పుకార్లేనని తేల్చారు. ప్రస్తుతం డేటింగ్​లో ఉన్న హీరోయిన్​ నయనతార- దర్శకుడు విఘ్నేశ్​ శివన్​లకు​ కరోనా సోకిందని సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు షాకయ్యారు. ఆ తర్వాత అసలు నిజం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.

 

అయితే కరోనా వచ్చిన విషయం వదంతేనని వారి సన్నిహితులు కొట్టిపారేశారు. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని సూచించారు. ఇంటికే పరిమితమైన వీరిద్దరూ బాగానే ఉన్నట్లు స్పష్టం చేశారు.

 

2015లో వచ్చిన 'నేనూ రౌడీనే' సినిమా కోసం దర్శకుడు విఘ్నేశ్‌తో కలిసి నయన్ పనిచేసింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం, ప్రేమగా మారింది. ఆ తర్వాత నుంచి ఈ జంట, కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం నయన్‌.. 'నెట్రికారన్‌', 'కాతువక్కుల రెండు కాదల్‌', 'ముక్తి అమ్మన్‌' చిత్రాల్లో నటిస్తోంది.


నేను రౌడీ నే ఈ సినిమాలో నయనతార గొప్ప నటనతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో నయనతార చెవులు వినిపించని పాత్రలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. నటన పరంగా నయనతారకు ఈ సినిమా పేరు వచ్చిందని చెప్పాలి. అమాయకం, చెవులు వైకల్యం పాత్రలో నటించింది.
సినీ నటుడు , డాన్స్ మాస్టర్ ప్రభు దేవా  ప్రేమ, తరువాత పెళ్లి వరుకు వెళ్ళిన తరువాత అనేక పరిణామాలు మధ్య వారు ఇరువురు విడిపోయారు. ఇప్పుడు మళ్లీ ప్రేమ లో ఉన్నారు విఘ్నేశ్‌, నయన తార  ప్రేమ లో మునిగి తేలుతున్న ఫోటోలు  వైరల్ అవుతున్నాయి. వీరి పెళ్లి ఎప్పుడు అని అభిమానులు చాలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ అయిన మెట్టింటికి ఈ తార వెళ్తుంది అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కి నయన తార పెట్టింది పేరు గా మారి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: