లేడి సూపర్‌స్టార్‌ నయనతార, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌లకు కరోనా పాజటివ్‌గా తేలిందని ఓ వార్త ప్రచారంలోకి రావ‌డంతో వారి అభిమానులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. అయితే అదంతా ఫేక్ న్యూస్ అని ఇందులో ఎంత‌మాత్రం నిజం లేద‌ని అధికారులు తేల్చేశారు. ఇదే విష‌యాన్ని  నయన్, విఘ్నేశ్‌ల అధికార ప్రతినిధి స్ప‌ష్టం చేశారు. నయన్‌, విఘ్నేశ్‌లకు కరోనా సోకిందనే వార్తలను ఖండించారు. వారిద్దరు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడించారు. దీంతో న‌య‌న్‌, విష్నేష్‌ల అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇలాంటి వార్తలు ఈ మధ్య గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇలాంటి వార్తలను వ్యాపింపజేసే వారిని కఠినంగా శిక్షించాలని నయన్ అభిమానులు సోషల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్లు కోరుతున్నారు.

 

ఇదిలా ఉండ‌గా లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌‌ల మధ్య ప్రేమ నడుస్తుందని, త్వరలో వారు ఒక్కటి కాబోతున్నారనే వార్తలు చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి. కొంత‌కాలంగా వారిద్దరూ సహజీవనం చేస్తున్నారనే విషయం తెలిసిందే. చాలా కాలంగా నయన్‌, విఘ్నేష్‌లకు సంబంధించి ఎదో ఒక వార్త వైరల్‌ అవుతూనే ఉంది. ఈ మ‌ధ్య‌కాలంలో వీరి గురించి బాగా వైర‌ల్ అయిన న్యూస్ ఏంటంటే పెళ్లి చేసుకోబోతున్నార‌ని. లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమైన ఈ జంట గుడిలో పెళ్లి చేసుకుని దాంపత్య జీవితానికి స్వాగతం పలకాలని భావిస్తున్నట్లు వార్తలు షికారు చేస్తున్నారు. 

 


లాక్‌డౌన్‌ నిబంధనలను సవరిస్తూ దేశవ్యాప్తంగా దేవాలయాలు ఈనెల 8 నుంచి తెరుచుకుంటాయని కేంద్రం ఇటీవల నూతన మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో తమిళనాడులోని ఓ ప్రముఖ ఆలయంలో వివాహం చేసుకోవాలని ఈ జంట ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కేవలం కొంతమంది అతిథుల సారథ్యంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అతి కొద్దిమంది స‌న్నిహితుల మ‌ధ్య ఓ దేవాల‌యంలో నయన్‌, విఘ్నేశ్‌లు పెళ్లి చేసుకోబోతున్నట్టు  వార్తలు వచ్చాయి. అయితే దీనిపై నయన్‌, విఘ్నేష్‌ల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: