ప్రియమణి.. ఈ పేరుకు ప్రత్యేంగా పరిచయాలు అవసరం లేదు. 2003లో `ఎవరే అతగాడు?` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటి.. ప్రేక్షకులకు చేరువ కాలేకపోయింది. ఆ తర్వాత తమిళంవైపు కొన్నాళ్లు దృష్టి పెట్టి మళ్లీ `పెళ్ళైనకొత్తలో..` అంటూ హీరో జగపతి బాబుతో జతకట్టింది. ఈ సినిమాతో ప్రియమణి సుడి తిరిగిపోయింది. ఒకేసారి తెలుగులో మూడు అవకాశాలు వచ్చి చేరాయి. ఆ తర్వాత దర్శకధీరు రాజమౌళి తెరకెక్కించిన `యమదొంగ`లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనస్సులో మంచి స్థానాన్ని సంపాదించుకుంది.
ఇక అప్పటి వరకూ తెలుగింటి అమ్మాయిలా సంస్కారవంతంగా ఉన్న ప్రియ ద్రోణాతో గ్లామర్ డాల్ అవతారమెత్తింది. అలా తెలుగులో క్రేజీ హీరోయిన్గా ఫుల్ బిజీ అయ్యింది. తెర ఏదైనా, క్యారెక్టర్ ఎలాంటిదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి నటించడం ఈమె స్టైల్. ఇక ప్రియమణి వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఐదేళ్లు ప్రేమించిన బాయ్ ఫ్రెండ్ ముస్తఫా రాజ్ను ఈమె వివాహం చేసుకుంది. ముస్తఫా రాజ్ ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ రన్ చేస్తున్నారు.
ప్రియమణి, ముస్తఫా రాజ్ తోలిసారి ఓ షో లో కలిసారు, ఆ పరిచయం ప్రేమగా మారి, వివాహ బందంతో ఒక్కటయ్యారు. చాలా కాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ ప్రేమ పక్షులు 2016లో నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లి కూడా వెంటనే ఉంటుందని ప్రకటించారు. కానీ అదికాస్త ఆలస్యమైంది. అయితే 2017లో అంగ రంగ వైభవంగా ధూమ్ ధామ్ హడావుడి ఏం లేకుండా కేవలం రిజిస్టర్ ఆఫీస్లోనే చాలా సింపుల్గా ఈ జంట పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మతాలు వేర్వేరు కావడం వల్లనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాని ప్రియమణి క్లారిటీ కూడా ఇచ్చింది.
అయితే గతంలో నిశ్చితార్థం ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టిన ప్రియమణి అందర్ని ఆశీర్వదించమని కోరగా.. కొందరు అభిమానులు శుభాకాంక్షలు చెప్పగా, మరికొందరు నెగిటివ్ లవ్ జీహాద్ పేరుతో కామెంట్స్ పెట్టారట. మరియు బంధువుల నుంచి కూడా ప్రియమణి ఎన్నో మాటలు ఫేస్ చేసిందట. కానీ, వాటికి అధైర్యపడకుండా ముందుకు సాగింది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైన ప్రియమణి బుల్లితెర ప్రవేశం చేసి అక్కడా రాణించింది. ఇక ప్రస్తుతం సినిమాల్లోనూ ఎంట్రి ఇచ్చింది ఈ బ్యూటి.