తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే పెళ్లి  చేసుకుని సినిమాలకు దూరమైన నిన్నటితరం స్టార్ హీరోయిన్లలో ఒకరు కుష్బూ . కుష్బూ కి  తెలుగు తమిళ కన్నడ చిత్ర పరిశ్రమలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ గా తన అందం అభినయంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది కుష్బూ . అభిమానులు ఖుష్బూకి గుడి కట్టించి మరి పూజించారు అంటే ఎంతలా  సినీ ప్రేక్షకులను ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా తెలుగు తమిళ కన్నడ చిత్ర పరిశ్రమలో అందరు స్టార్ హీరోల సరసన నటించింది కుష్బూ.  ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించింది. 

 

 కుష్బూ నటించిన ఎన్నో సినిమాలు చిత్ర పరిశ్రమలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇక  తెలుగు తమిళ కన్నడ చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్గా కెరీర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే కన్నడ నిర్మాత అయిన సుందర్ ని వివాహం చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు  పూర్తిగా సినిమాలకు దూరం అయిపోయింది అని చెప్పాలి. కన్నడ నిర్మాత అయిన సుందర ని ప్రేమించి వివాహం చేసుకుంది కుష్బూ. ఇక వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు కుమార్తెలు కూడా జన్మించారు. వారి పేరు అవంతిక అనందిత. 

 


 అయితే కుష్బూ కన్నడ నిర్మాత సినిమాటోగ్రాఫర్ అయిన సుందర్ ను రెండో వివాహం చేసుకుంది. ముందుగా కుష్బూ కన్నడ చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న నటుడు ప్రభు వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీరి మధ్య పలు మనస్పర్థల కారణంగా వీరు విడాకులు తీసుకుని వేరు పడ్డారు. ఇక అనంతరం సుందర ని పెళ్లి చేసుకుంది కుష్బూ. ఇక పెళ్లి తర్వాత కుష్బూ  పూర్తిగా సినిమాలకు దూరం అవ్వడంతో ఆ తదనంతర కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం మొదలు పెట్టింది. అంతేకాకుండా బుల్లితెరపై వ్యాఖ్యాతగా కూడా అవతారం ఎత్తింది.

మరింత సమాచారం తెలుసుకోండి: