నేచురల్ స్టార్ నాని, టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రం 'శ్యామ్ సింగ రాయ్'. ఈచిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించనుందని వార్తలు వచ్చాయి కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఫిబ్రవరి నుండి ఈసినిమా కోసం సాయి పల్లవి వెంట పడుతున్నారు మేకర్స్. అయితే సాయి పల్లవి, సినిమాను హోల్డ్ లో పెడుతూవచ్చింది. ఇక తాజాగా ఆమె ఓకే చెప్పిందని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. నాని, సాయి పల్లవి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. ఇంతకుముందు వీరిద్దరూ ఎంసీఏ లో నటించారు. శ్యామ్ సింగ రాయ్ ని సితార ఎంటెర్టైన్మ్నెంట్స్ నిర్మించనుండగా అనిరుద్ సంగీతం అందించనున్నాడు. కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈచిత్రం వచ్చే ఏడాది  విడుదలకానుంది. 
 
ఇక నాని ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో టక్ జగదీష్ లో నటిస్తున్నాడు. ఇటీవలే ఈసినిమా రెండు కీలక షెడ్యూల్ లను పూర్తి చేసుకోగా జులై నుండి తదుపరి షెడ్యూల్ షూటింగ్ జరుగనుంది. రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. సాహు గారపాటి ,హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం ఈఏడాది చివర్లో విడుదలకానుంది. 
 
ఇదిలా ఉంటే నాని ఈసినిమాల కన్నా ముందు వి తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మార్చిలోనే విడుదలకావల్సిన ఈచిత్రం కరోనా వల్ల వాయిదాపడింది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో మల్టీ స్టారర్ గా రానున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు పోలీస్ గా నాని విలన్ గా కనిపించనున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా అదితి రావ్ హైదరి ,నివేత థామస్ హీరోయిన్లుగా నటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: