హీరోయిన్ లు ఇప్పుడు సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో రోజు రోజుకి పరిస్థితి కాస్త భయంకరంగా మారుతుంది అనే వ్యాఖ్యలు అయితే వినపడుతున్నాయి. ఈ నేపధ్యంలో హీరోయిన్ ల భవిష్యత్తు ఏంటీ అనే ప్రశ్న వినపడుతుంది. హీరోలు ఒక ఏడాది సినిమాలు చేయకపోయినా సరే వారికి వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. మళ్ళీ వచ్చే ఏడాది సినిమాలు చేసుకోవచ్చు.
హీరోయిన్ ల పరిస్థితి అలా కాదు. హీరోయిన్ లు సినిమాలు చేయకపోతే మాత్రం వాళ్ళను పట్టించుకునే వారు ఉండరు. ఇప్పుడు అదే చర్చ టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ లో ఎక్కువగా భయం ఉంది అని అంటున్నారు. కరోనా వల్ల రెండేళ్ల పాటు తమ కెరీర్ కరిగిపోతోందన్న భయంతో హీరోయిన్లు ఉన్నారట. అందుకే ఇప్పుడు హీరోయిన్ లు అందరూ కూడా భవిష్యత్తు ప్రాజెక్ట్ ల మీద ఫోకస్ చేసారు అని టాక్. అవును ఇప్పుడు రష్మిక, పూజ సహా మరి కొందరు హీరోయిన్ లు అదే చేస్తున్నారు.
వీరంతా కరోనా వల్ల కోల్పోయిన సినిమాలను సెట్ చేసుకునేందుకు ఒక రెండేళ్ళు మూడేళ్ళకు సరిపడా సినిమాలను లైన్ లో పెట్టుకోవాలి అని ప్లాన్ చేస్తున్నారు. అలా అయితే తమకు వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు అని భావిస్తున్నారట వారు. మరి అది ఎంత వరకు ఫలిస్తుంది అనేది చూడాలి. రష్మిక చేతిలో సినిమాలు ఉన్నాయి... అయితే ఇప్పుడు ఆ సినిమాల బడ్జెట్ తగ్గడంతో పాటు రష్మిక రేటు తగ్గించు కోకపోతే ఆమెను కూడా ఆ సినిమాల నుంచి తప్పించే ఛాన్స్ ఉంది.