దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. తన పాత ఫార్ములాతోనే కొత్త కొత్త వివాదాల్లో చిక్కుకుంటాడు వర్మ. ఎవరు టచ్ చేయని రియల్ స్టోరీ లను ,ఎవరూ ఊహించని కథలను రాస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాడు. నిత్యం ఏదొక వివాదంతో వార్తల్లో నిలిచే వర్మ మరో కొత్త  వివాదంతో ముందుకొచ్చాడు. ఇప్పటికే లాక్ డౌన్ సమయంలో కాలీగా ఉండకుండా కరోనా వైరస్ మీద సినిమా తీసి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నాడు వర్మ. తాజాగా అమృత ప్రణయ్ప్రేమ వివాహం పరువు కోసం మారుతీ రావు హత్య ను కథామ్సంగా  తీసుకొని సినిమా నిర్మించబోతున్నట్టు ప్రకటించారు.  దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసాడు ఈ డైరెక్టర్. అయితే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ పై మారుతీ రావు కూతురు అమృత ఇలా స్పందించారు.

 

 

పోస్టర్ చూసిన వెంటనే ఆత్మహత్య చేసుకోవాలి అని అనిపించింది. ఇప్పటికే తన జీవితం తలకిందులు అయింది అని, ప్రణయ్ ను, తన తండ్రిని కోల్పోయాను అని అన్నారు.ప్రేమించిన వ్యక్తి నీ పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్పా అని ప్రశ్నించారు.ఎవరికి తన గురించి, తన క్యారెక్టర్ గురించి తెలీదు అని, తన సన్నిహితులకు మాత్రమే తెలుసు అని వ్యాఖ్యానించారు. అయితే మరొకసారి ప్రణయ్ హత్య గురించి ప్రస్తావిస్తూ అమృత తన ఆవేదన వ్యక్తం చేశారు. గర్వంతో, పరువు పోతుందన్న తప్పుడు ఆలోచనతో ప్రణయ్ ను నా తండ్రి హత్య చేయించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా న్యాయం కోసం పోరాడుతున్నాను అని అన్నారు. ఇలాంటి సమయంలో ఇపుడు రామ్ గోపాల్ వర్మ రూపంలో మరొక సమస్య ఎదురౌతుంది అని, తన జీవితాన్ని బజారులో పెట్టొద్దు అని, ఈ విషయం తెలిసినప్పటి నుండి భయంతో వనికిపోయాను అన్నారు.

 

 

ఫస్ట్ లుక్ కి, మా జీవితాలకు పోలిక లేదు అని,ఇది తప్పుడు కథ అని,రెండు నిమిషాల పేరు కోసం నీలాంటి ప్రముఖుడు ఎంత నీచానికైనా దిగజరుతాడని దుయ్యబట్టారు. మహిళలను ఎలా గౌరవించాలి అని నేర్పే తల్లి నీకు లేనందుకు నిన్ను చూస్తే జాలేస్తుంది అని అన్నారు. ఇప్పటికే నా జీవితంలో ఎన్నో ఉడిదుడుకులకు లోనయ్యానని ఇంకా నా జీవితాన్ని రోడ్డుకు ఈడిచొద్దని. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు వల్లే సమాజంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వర్మ పై ఫైర్ అయిపోయింది అమృత.

మరింత సమాచారం తెలుసుకోండి: