కరోనా ఏమో గాని సోషల్ మీడియాలో దాని గురించి జరిగే ప్రచారం అంతా ఇంత కాదు. ఎవరో ఒకరు ప్రముఖులు కరోనా బారిన పడితే మిగిలిన వారు కూడా కరోనా బారిన పడ్డారు అనే ప్రచారం సోషల్ మీడియాలో చేస్తూ కొంత మంది రాక్షస ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు కొందరు. హుందా గా వ్యవహరించాల్సిన సమయంలో కరోనా మీద లేనిపోని ప్రచారం చేస్తూ అనవసర భయాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం ఊపు అందుకుంది.

 

తమిళ హీరోయిన్ నయనతార అదే విధంగా ఆమె బాయ్ ఫ్రెండ్ విజ్ఞేశ్ శివన్ కరోనా బారిన పడ్డారు అని వారికి చికిత్స అందిస్తున్నారని నయనతార ఐసియు లో ఉంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీనిపై విజ్ఞేశ్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసాడు. అసలు మాకు కరోనా రాలేదని స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసాడు. మాకు కరోనా లేదని ఇది కేవలం రూమర్ అని కొట్టిపారేశాడు. తాము ఇలాంటివి చూసి నవ్వుకున్తున్నామని అన్నాడు. జోక్స్ చూసి నవ్వుకునే అదృష్టం  దేవుడు తమకు ప్రసాదించాడు అంటూ కామెంట్ చేసాడు. 

 

కాగా  వీరు ఇద్దరూ ఇటీవలి కాలం లో విడిపోయారు అనే ప్రచారం సోషల్ మీడియా లో బాగానే జరిగింది. దీని మీద వాళ్ళు పెద్దగా స్పందించలేదు గాని ప్రచారం మాత్రం ఒక రేంజ్ లో చేసారు తమిళ జనాలు. మరి వీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనేది చూడాలి. వీరు ఇద్దరూ కలిసి ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడటం తో ఇద్దరూ కూడా ఇంట్లో నే ఉండిపోయారు. మరి ఎప్పుడు షూటింగ్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: