రామ్ గోపాల్ వర్మ  సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. వివాదాస్పద సినిమాలను తెరకెక్కిస్తూ  మీడియలో  ఎప్పుడు  హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటాడు. అంతేకాదు వర్మ ఏం మాట్లాడినా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అందుకే రామ్ గోపాల్ వర్మ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులందరికీ వివాదాలే ముందుగా గుర్తు వస్తాయి. ఇప్పటికే ఎన్నో వివాదాస్పద సినిమాలను తెరకెక్కించి సంచలనాలు సృష్టించారు రాంగోపాల్ వర్మ. ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సైతం షేక్ చేశారు అని చెప్పలేదు. ఇక ఇప్పుడు మరోసారి మరో వివాదాస్పదమైన సినిమాకు తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు రాంగోపాల్ వర్మ. 

 


 అప్పట్లో ప్రణయ్ పరువు హత్య ఇప్పుడు సంచలనంగా మారిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ కులానికి చెందిన ప్రణయ్ అమృత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం తో ఆమె తండ్రి మారుతీరావు ఏకంగా కిరాయి హంతకులను పెట్టి ప్రణయ్ ని దారుణంగా హత్య చేయించాడు ప్రస్తుతం దీని ఆధారంగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు రాంగోపాల్ వర్మ. అయితే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫాదర్స్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు రాంగోపాల్ వర్మ. అయితే దీనిపై అమృత ప్రణయ్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. 

 

 ఇక తాజాగా అమృత వ్యాఖ్యలపై స్పందించిన రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. నేను మొదట ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడే చెప్పానని ఒక నిజ జీవిత కథ ఆధారంగానే సినిమా ఉంటుందని  రామ్ గోపాల్ వర్మ తెలిపాడు. నిజ జీవిత కథ ఆధారంగా నేను తీసిన ఎన్నో సినిమాలను ప్రజలు ఆదరించారని... నేను కొంతమంది మంచివారు అని  కొంత మందిని చెడ్డవారి అని  చూపిస్తాను అని అనుకోవడం మూర్ఖత్వం అంటూ తెలిపాడు రాంగోపాల్ వర్మ. ఎందుకంటే ఎవరు చెడ్డ వారు కాదని పరిస్థితులు  మాత్రమే మనుషులను చెడ్డ గా మారుస్తాయి అంటూ చెప్పుకొచ్చాడు. అమృత అయిన ఇంకెవరైనా బాధను ఎదుర్కొన్నా వారంటే  తనకు ఎంతో గౌరవంగా ఉంటుందని అయితే... ఈ సినిమాలో చిత్తశుద్ధితో నే తెరకెక్కించబోతున్నటు రామ్ గోపాల్ వర్మ తాజాగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: