ఇప్పుడు టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అతను పెద్దగా  క్రికెట్ కూడా ఆడటం లేదు అనే చెప్పాలి. అతను ఆడే ఆవకాశం ఉంది అని భావించిన ఐపిఎల్ కూడా ఈ మధ్య రద్దు అయ్యే పరిస్థితే కనపడింది అని చెప్పాలి. ఇటీవల ఐపిఎల్ విషయంలో గంగూలీ నుంచి ఒక ప్రకటన వస్తుంది అని భావించినా సరే ఐపిఎల్ నిర్వహణ అనేది ఇప్పట్లో సాధ్యం అయ్యే పని కాదు అనే అభిప్రాయానికి జనాలు వచ్చేశారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వార్త  సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

 

ఇక ధోని ఇప్పుడు సినిమాల్లో నటించే ఆలోచనలో ఉన్నాడు అనే టాక్ వినపడుతుంది. అవును ధోనీ సినిమాల్లో చేయడానికి గానూ ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్. అతనికి రణవీర్ సింగ్ కి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి ఎప్పటి నుంచో ధోనీ ఒక సినిమాను చెయ్యాలి అనే ప్లాన్ కూడా చేస్తున్నాడు అనే టాక్ వినపడింది అప్పట్లో. కాని అది ఇప్పుడు సాధ్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. రణవీర్ సింగ్ హీరో గా విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఒక సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమాలో ధోనీ నటించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

అదే విధంగా ఒక క్రికెటర్ బయోపిక్ లో కూడా ధోని కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ధోనీ ఏ సినిమాలో చేస్తాడు అనేది. ఇప్పుడు అతను దాదాపుగా క్రికెట్ లేక ఖాళీ గా ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి. భార్యతో కలిసి నటిస్తాడని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: