బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కి వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాబు అక్కడి నుంచి ఏది చేసినా సరే జనాలు ప్రత్యేకంగా చూడటం అనేది మొదలు పెట్టారు. అగ్ర హీరోలు అయినా చిన్న హీరోలు అయినా సరే ప్రభాస్ ని ఫాలో అవడం కూడా మొదలు పెట్టారు. అతను చేసిన పాన్ ఇండియా సినిమాలను ఆదర్శంగా తీసుకుని మహేష్ బాబు రామ్ చరణ్ వంటి వారు పాన్ ఇండియా సినిమాల మీద ఫోకస్ చేసారు అనేది తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే అతను ఒక హిందీ ఛానల్ ని పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. 

 

బాలీవుడ్ లో ఇక పూర్తి స్థాయి సినిమాలు చెయ్యాలి అని భావిస్తున్న ఆయన దాదాపుగా అక్కడ పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయడానికి సిద్దంగా ఉన్నట్టు ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రభాస్ అక్కడ పెట్టుబడి పెట్టడానికి గానూ దాదాపుగా మార్గం సుగుమం  చేసుకున్నాడు అని సమాచారం. మరి అది ఎంత వరకు నిజం అనేది త్వరలోనే తెలుస్తుంది. శ్రద్దా కపూర్ తో పాటుగా కరణ్ జోహార్ తో కలిసి ఈ  ప్రభాస్ వ్యాపారం మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి. చూడాలి ఎం జరుగుతుంది అనేది.

 

ఇప్పుడు అతను రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే సూచనలు ఉన్నాయి. దాదాపుగా అతను సినిమాల విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకునే చేస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న నేపధ్యంలో ఇప్పుడు పెట్టుబడి పెట్టే విషయంలో కూడా ఒకటికి పది సార్లు ఆలోచన చేసి పెడుతున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి బాలీవుడ్ లో ఈ వ్యాపారం ఎప్పుడో చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: