టాలీవుడ్ లో ఇప్పుడు హీరోలు ఎక్కువగా నిర్మాణ రంగం మీద దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. వరుసగా సినిమాలను నిర్మిస్తున్నారు. అగ్ర హీరోలు అందరూ కూడా ఇప్పుడు సినిమాలను నిర్మించే పని లో పడ్డారు. చిన్న హీరోలు పెద్ద హీరోలు అందరూ కూడా ఇప్పుడు సినిమాలను నిర్మిస్తే మంచి లాభాలు ఉన్న నేపధ్యంలో ఆ దిశగానే అడుగులు ఎక్కువగా వేస్తున్నారు అనేది అర్ధమవుతుంది. ఇక ఇది పక్కన పెడితే తాజాగా  మహేష్ బాబు ఇప్పుడు సినిమాల నిర్మాణం విషయంలో కాస్త దూకుడుగా ఆలోచిస్తున్నాడు. అవును ఇప్పుడు అతను వరుసగా సినిమాలను నిర్మించే పనిలో పడ్డాడు. 

 

మహేష్ బాబు ఇప్పుడు విజయ్ దేవరకొండ సహా కార్తీ, శర్వా తో సినిమాలు చేస్తున్నాడు. శ్రీమంతుడు సినిమా నుంచి నిర్మాణ రంగం లో అడుగు పెట్టిన మహేష్ బాబు ఇప్పుడు  వరుసగా సినిమాలను నిర్మించే ప్లాన్ లో ఉన్నాడు అనేది అర్ధమవుతుంది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు అనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ ఒక సినిమా చేస్తున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వస్తుంది ఈ సినిమా. ఈ సినిమాలో మహేష్ బాబు నిర్మాతగా ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. 

 

ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇప్పటికే మహేష్ సైన్ కూడా చేసాడు అని త్వరలోనే దీనిని సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. అదే విధంగా నానీ తో కూడా ఒక సినిమాను మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నాడు అనే వార్తలు టాలీవుడ్ లో ఎక్కువగా వస్తున్నాయి మరి. చూడాలి అసలు ఎం జరుగుతుంది అనేది. అగ్ర హీరోల సినిమాలను కూడా మహేష్ నిర్మించే ప్లాన్ లో ఉన్నాడు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: