గతంలో తనను వెళ్లగొట్టిన చోటే, ప్రస్తుతం బంగ్లా కొనుగోలు చేసి అందులోనే ఉంటున్నానని హీరో అక్షయ్ కుమార్ చెప్పారు. ఈ నటుడు.. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 32 ఏళ్ల క్రితం తనను ఎక్కడి నుంచైతే వెళ్లగొట్టారో సరిగ్గా అదే చోట ఓ బంగ్లా కొనుగోలు చేసి, ప్రస్తుతం నివసిస్తున్నానని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చెప్పారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు పంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

 

 

అసలేం జరిగింది? 

బాలీవుడ్​లోకి అడుగుపెట్టకముందు తాను ముంబయిలో ఓ ఫొటోగ్రాఫర్​ దగ్గర సహాయకుడిగా పనిచేసేవాడినని చెప్పారు అక్షయ్. అయితే 4-5 నెలలు జీతానికి బదులుగా తనకు ఫొటోషూట్​ చేసిపెట్టమని ఆయన్ని అడిగినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో వీరిద్దరూ జుహూ బీచ్​ దగ్గర్లని ఓ బంగ్లాను చూశారు. దాని పిట్టగోడపై అక్షయ్ ఉండగా, నాలుగైదు ఫొటోలు తీశారు. ఇంతలో వాచ్​మన్ వచ్చి వారిని వెళ్లగొట్టాడు. అయితే ఇప్పుడు సరిగ్గా అదే చోట కట్టిన బంగ్లాలో తాను ఉంటున్నట్లు అక్షయ్ తెలిపారు. గతంలో తనను వెళ్లగొట్టిన చోటే, ప్రస్తుతం బంగ్లా కొనుగోలు చేసి అందులోనే ఉంటున్నానని హీరో అక్షయ్ కుమార్ చెప్పారు. ఈ నటుడు.. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.  ఈ సందర్భంగా పాత, కొత్త ఫొటోలను కలిపి చూపించారు. ఈ విషయమై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 


అక్షయ్ నటించిన 'లక్ష్మీబాంబ్' విడుదల కావాల్సి ఉంది. దీంతో పాటే 'బచ్చన్ పాండే', 'బెల్ బాటమ్' రీమేక్​తో పాటు 'పృథ్వీరాజ్' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారీ కథానాయకుడు. ఇలాంటి విషయాలను అభిమానులతో పంచుకున్నప్పుడు ఇరువురు ఆనందం వ్యక్తం చేస్తారు. ఆనందంతో ట్విట్టర్లో  ఈ పోస్ట్ పెట్టిన కొద్ది క్షణాల్లోనే 140 మంది పైగా దీని గురించి చర్చ మొదలు పెట్టారు. విజయం అంటే ఇలా ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: